AP Corona Cases: కొత్తగా 878 కరోనా కేసులు.. 13 మంది మృతి

AP Corona Cases: కొత్తగా 878 కరోనా కేసులు.. 13 మంది మృతి
AP Corona Cases: గడిచిన 24 గంటల్లో 878 కేసులు నిర్ధారణ అయ్యాయి.

AP Corona Cases: ఏపీలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 878 కేసులు నిర్ధారణ అయ్యాయి. 41,173 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,13,001 మంది వైరస్‌ బారినపడినట్లు వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,862 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,65,76,995 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.కరోనా బారినపడి 13 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 13,838కి చేరింది. 1,182 మంది బాధితులు కోలుకోవడం ద్వారా వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,84,301కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.


Tags

Read MoreRead Less
Next Story