Suicide : 8వ తరగతి అమ్మాయి సూసైడ్ తల్లిదండ్రుల ఆవేదన

Suicide : 8వ తరగతి అమ్మాయి  సూసైడ్ తల్లిదండ్రుల ఆవేదన
X

ఏపీలోని గుంటూరు పట్టణానికి చెందిన ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో విద్యార్థిని ఆత్మహత్య సంచలనం రేపింది. చిలకలూరిపేటకు చెందిన కరణం పద్మసుధ 8వ తరగతి చదువుతోంది. స్కూల్‌లోనే నిన్న రాత్రి ఉరివేసుకుని చనిపోయినట్లు యాజమాన్యం చెప్పడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పద్మసుధ మృతికి కారణాలు తెలిపేందుకు యాజమాన్యం ముఖం చాటేసింది. స్కూల్‌ సిబ్బంది కూడా మృతికి వివిధ కారణాలను చెబుతుండటంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మీడియా, పోలీసు సహకారం కోరుతూ స్కూల్‌ వద్ద బైఠాయించారు. పోలీసులు ఇరువర్గాల వెర్షన్ రికార్డ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story