Nellore : కొడుకు శవాన్ని భుజాన వేసుకుని బైక్‌ పైనే ఇంటికి

Nellore : కొడుకు శవాన్ని భుజాన వేసుకుని బైక్‌ పైనే ఇంటికి
Nellore :కన్నబిడ్డను కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న సాటి మనిషికి సాయం చేసే గుణం కూడా రోజురోజుకూ చచ్చిపోతోంది.

Nellore :కన్నబిడ్డను కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న సాటి మనిషికి సాయం చేసే గుణం కూడా రోజురోజుకూ చచ్చిపోతోంది. మొన్న తిరుపతిలో, ఇప్పుడు నెల్లూరులో వెలుగు చూసిన ఘటనలు కన్నీరు పెట్టిస్తున్నాయి. పిల్లల మృతదేహాల్ని భుజాన వేసుకుని, బైక్‌పై తండ్రులు ఇళ్లకు చేరిన తీరు హృదయాల్ని కలిచి వేస్తోంది.

నిన్న నెల్లూరు జిల్లా సంగం కనిగిరి రిజర్వాయర్‌ ప్రధాన కాల్వలో పడి ప్రమాదవశాత్తూ ఇద్దరు చిన్నారులు చనిపోయారు. ఓ బాలుడు కొనఊపిరితో ఉన్నప్పుడు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వేరే చోటికి తీసుకువెళ్లేందుకు అంబులెన్స్ సిద్ధం చేసినా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు.

దీంతో.. కుమారుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు ఓ తండ్రి పడిన ఆవేదన అంతా ఇంతా కాదు. అంబులెన్స్‌ కానీ, ఆటో కానీ మరే వాహనం కానీ దొరక్క…. విధి లేని పరిస్థితుల్లో చివరికి కొడుకును భుజాన వేసుకుని బైక్‌పైనే ఇంటికి చేరుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story