Chittoor: కలకలం రేపుతున్న వైసీపీ కార్యకర్త సెల్ఫీ వీడియో.. తన చావుకు స్థానిక నేతలు కారణమంటూ..
Chittoor: చిత్తూరు జిల్లా చంద్రగిరిలో వైసీపీ కార్యకర్త సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. తన చావుకు కారణం అధికారులు, స్థానిక నేతలేనంటూ వెంకటేష్ ఆచారి... సెల్ఫీ వీడియో విడుదల చేశారు. అతని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంపించాడు. పనపాకంలో ఉన్న తన స్థలాన్ని స్థానిక నేతల సాయంతో కొందరు ఆక్రమిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఏడాది కాలంగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా... పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే నాయకుల హామీతో రోడ్డు పనులు చేస్తే... ఆరు లక్షలు అప్పు మిగిల్చారు తప్ప... ప్రభుత్వం నుంచి డబ్బులు రాలేదన్నారు. అందుకే తీవ్రస్తాపంతో సూసైడ్ చేసుకుంటున్నట్లు వీడియోలో ఆవేదన తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు... వెంకటేష్ కోసం పనపాకం అడవుల్లో గాలిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com