Tirupati : అమరావతి రైతు మహాసభకు పోటెత్తిన జనం..!
తిరుపతి వేదికగా జరుగుతున్న అమరావతి రైతు మహా సభకు.. జనం పోటెత్తారు. సభకు ప్రజలు రాకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా.. జన ప్రభంజనంతో తిరుపతి వీధులు నిండిపోయాయి.
BY vamshikrishna17 Dec 2021 7:41 AM GMT

X
vamshikrishna17 Dec 2021 7:41 AM GMT
తిరుపతి వేదికగా జరుగుతున్న అమరావతి రైతు మహా సభకు.. జనం పోటెత్తారు. సభకు ప్రజలు రాకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా.. జన ప్రభంజనంతో తిరుపతి వీధులు నిండిపోయాయి. వివిధ జిల్లాలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివాడంతో.. నగరమంతా కోలాహలంగా మారింది. సభ ప్రాంగణం అప్పుడే జనంతో కిక్కిరిసిపోగా.. టీడీపీ, బీజేపీ, జనసేన, సీపీఐ, సీపీఎం ముఖ్యనేతలు సభకు చేరుకున్నారు. అమరావతి గొప్పతనాన్ని, ఖ్యాతిని.. ఆంధ్రప్రదేశ్కు బలమైన రాజధాని ఉండాల్సిన అవసరాన్ని.. సాంస్కృతిక కళకారాలు నృత్య, గీతాల రూపంలో వివరిస్తున్నారు. ఆంధ్రుల కలల రాజధాని ఒక్కసారిగా ఆగిపోవడం వల్ల.. రాష్ట్రం ఏ స్థితికి వెళ్లిందో.. కళకారులు వివరించారు. పెద్ద ఎత్తున వచ్చిన మహిళలు, రైతులు, అమరావతి రాజధానిని కాంక్షించేవారితో సభా స్థలి కళకళలాడుతోంది. జై అమరావతి.. జైజై అమరావతి నినాదాలతో మార్మోగుతోంది.
Next Story
RELATED STORIES
Amalapuram: అమలాపురం అల్లర్ల కేసులో మరో 25 మంది అరెస్టు..
28 May 2022 3:54 PM GMTKurnool: ఆదోని మార్కెట్లో దూసుకెళ్లిన పత్తి ధర.. క్వింటాలుకు...
28 May 2022 3:30 PM GMTAtchannaidu: మహానాడుకు వచ్చిన ప్రభంజనం జగన్ ప్రభుత్వానికి చెంపదెబ్బ-...
28 May 2022 3:05 PM GMTChandrababu: అధికారంలోకి వచ్చాక జగన్ అవినీతిని కక్కిస్తాం-చంద్రబాబు
28 May 2022 2:30 PM GMTBalakrishna: భావి తరాల భవిష్యత్ కోసం చంద్రబాబు ఆలోచిస్తారు: బాలకృష్ణ
28 May 2022 2:01 PM GMTChandrababu: అధికారంలోకి వచ్చాక ఎవ్వరినీ వదిలేది లేదు: చంద్రబాబు
28 May 2022 1:43 PM GMT