ఆనందయ్యను రహస్య ప్రాంతానికి తరలింపు..
ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందుతో కరోనా కనిపించకుండా పోతుంది.. ఇదే ఆయన పాలిట శాపమైంది. ఆయన తయారు చేస్తున్న మందు అశాస్త్రీయమైనదంటూ కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి.
మరి కొందరు అల్లోపతి మందు వాడినా ప్రాణాలు పోతున్నాయి కదా మరి దానికేమంటారు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వీటన్నింటి మధ్య ఆయన మందు ఇవ్వడం నిలిపివేశారు. ఈ ఔషధంపై సోమవారం నివేదిక వస్తుంది.
అప్పటి వరకు ఆయనను రహస్య ప్రదేశంలో ఉంచడం మంచిదని భావించింది ప్రభుత్వం. ఈ మేరకు పోలీసులను పురమాయించి ఆయనను కృష్ణపట్నం నుంచి తరలించారు. ఆనందయ్య ఔషధం కోసం వస్తున్న జనాన్ని పోలీసులు అడ్డుకుంటున్న విషయం తెలిసిందే.. కృష్ణపట్నంలో ఇప్పటికే 144 సెక్షన్ విధించారు. నెల్లూరు, ముత్తుకూరు నుంచి కృష్ణపట్నం వచ్చే రహదారుల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com