Andhra Pradesh : పెళ్లింట విషాదం

Andhra Pradesh : పెళ్లింట విషాదం
మరో పదిరోజుల్లో పెళ్లి ఉండగా, వరుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.


ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది.. మరో పదిరోజుల్లో పెళ్లి ఉండగా, వరుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.. మృతుడు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఉద్యోగి. ఈ ఘటనతో పంగిడిగూడెం గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. పంగిడిగూడెం గ్రామానికి చెందిన హరీష్‌ బాబు ఢిల్లీలో ఎయిర్‌ఫోర్స్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.

సంక్రాంతికి ఇంటికి వచ్చిన హరీష్‌.. ఈనెల 16న పెళ్లిపీటలు ఎక్కాల్సి ఉంది.. పెళ్లి పనులు చూసుకుంటున్నాడు. ఏమైందో ఏమోగానీ, ఉదయం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags

Next Story