Andhra Pradesh : వంశధారకు నిధులివ్వండి

Andhra Pradesh : వంశధారకు నిధులివ్వండి
వంశధార పూర్తయితే ఆయకట్టు కింద 12 వేల గ్రామాలకు సాగు, తాగునీరు అందుతుంది

వంశధార ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వాలని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు డిమాండ్ చేశారు. శుక్రవారం లోక్‌సభలో ప్రసంగించిన ఆయన టీడీపీ హయాంలో వంశధార ప్రాజెక్టు పనులు 92 శాతం పూర్తి అయ్యాయని గుర్తుచేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినా ప్రాజెక్టు పూర్తి చేయలేదని ఆరోపించారు. ప్రాజెక్టు లెఫ్ట్ కెనాల్‌ను కేంద్రం ఆధునీకరించాలన్నారు. వంశధార పూర్తయితే ఆయకట్టు కింద 12 వేల గ్రామాలకు సాగు, తాగునీరు అందుతుందని తెలిపారు. కేంద్రం వెంటనే నిధులు ఇచ్చి వంశధార పూర్తయ్యేలా చూడాలని రామ్మోహన్‌నాయుడు కోరారు.

Tags

Read MoreRead Less
Next Story