Andhra Pradesh : ఏపీ రైతులకు షాకింగ్ న్యూస్

కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఏపీ రైతులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. దేశంలో ఏపీ రైతులపైనే అత్యధిక రుణభారం ఉందన్నారు. జాతీయ స్థాయిలో సగటున ఒక్కో రైతు కుటుంబంపై సుమారు 74వేల రూపాయల అప్పు ఉంటే.. ఏపీలో సగటున 2లక్షల 45వేల రూపాయల చొప్పున ఉందని వెల్లడించారు. ఇది దేశంలో ఒక్కో రైతు కుటుంబం మోస్తున్న రుణభారం కంటే 231శాతం అధికమ న్నారు ఆయన. మంత్రి సమాధానం ప్రకారం దేశంలో రైతులు అత్యధిక రుణభారం మోస్తున్న రాష్ట్రాల్లో ఏపీ, కేరళ, పంజాబ్లు టాప్ -3లో ఉన్నాయి.
మున్ముందు కూడా రైతులకు రుణమాఫీ చేసే ఉద్దేశం తమకు లేదని కేంద్రమంత్రి భాగవత్ కరాడ్ వెల్లడించారు. ఏపీ, కేరళ, పంజాబ్ రాష్ట్రాల్లోని రైతు కుటుంబాలపై సగటు రుణభారం 2లక్షలు ఉంటుందని స్పష్టం చేశారు. హరియాణా, తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్తోపాటు తమిళనాడులోని రైతు కుటుంబాలపై లక్షకుపైగా రుణభారం ఉందన్నారు. అయితే అరుణాచల్ ప్రదేశ్లోని రైతు కుటుంబాలపై అత్యల్పంగా 3వేల 581, యూపీలోని రైతు కుటుంబాలపై 51వేల రూపాయలు ఉందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com