Andhra Pradesh: బీజేపీకి కన్నా గుడ్‌ బై

Andhra Pradesh: బీజేపీకి కన్నా గుడ్‌ బై
భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో కీలక సమావేశం, టీడీపీలో చేరేందుకే మొగ్గు

బీజేపీకి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బైబై చెప్పేశారు. భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో కీలక సమావేశం నిర్వహించిన కన్నా లక్ష్మీనారాయణ పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు తన రాజీనామా లేఖను పంపారు. గతంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ పనిచేశారు. ఆ తర్వాత సోము వీర్రాజుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించారు. అప్పట్నుంచి పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

సోము వీర్రాజు అధ్యక్షుడైన తర్వాత తనకు తీవ్ర అవమానం జరిగిందని తన అనుచరులతో కన్నా లక్ష్మీనారాయణ చెప్పినట్లు తెలుస్తోంది. అవమానం జరిగిన పార్టీలో కొనసాగలేమని అందుకే అందరూ ముకుమ్మడిగా పార్టీ వీడాలని అనుచరగణానికి పిలుపునిచ్చారు. ఇప్పటికే కన్నా వాహనానికి బీజేపీ జెండా తొలగించారు. టీడీపీలో చేరేందుకే కన్నా లక్ష్మీనారాయణ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అభిమానులు మాత్రం త్వరలో టీడీపీలో చేరడం పక్కా అంటున్నారు.

Tags

Next Story