AP: అభివృద్ధే లక్ష్యంగా ఏపీ కేబినేట్ కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ మంత్రిర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. ఏపీలో రూ. 85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపీబీ నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో నేరాలను నియంత్రించేందుకు పీడీ యాక్ట్ పటిష్టం చేస్తూ సవరణ బిల్లుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లోకాయుక్త చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇవే కాదు.. మరికొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా మంత్రివర్గ సమావేశాంలో ఆమోదించారు. పర్యాటక ప్రాజెక్టులకు పరిశ్రమ హోదా కల్పించే ప్రతిపాదనలపై చర్చించి ఆమోదించారు. అలాగే, జ్యుడీషియల్ ప్రివ్యూ రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ ఇన్ఫ్రా ట్రాన్స్పరెన్సీ యాక్ట్ 2019 రిపీట్ చేయాలని ప్రతిపాదించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో స్థానిక సంస్థల్లో ఛైర్మన్లపై అవిశ్వాసం పెట్టే అంశంపై చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. అవిశ్వాసం పెట్టే గడువును నాలుగేళ్ల నుంచి రెండేళ్లకు కుదిస్తూ చట్ట సవరణ చేశారు. అటు, డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ పేరును ఎలైట్ యాంటీ నార్కటిక్ గ్రూప్ గా మారుస్తూ కేబినెట్ తీర్మానం చేసింది.
మంత్రివర్గ సమావేశం నిర్ణయాలు..
2024 - 25 క్రీడా పాలసీకి కూడా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కోసం గృహ నిర్మాణ శాఖ చేసుకోనున్న ఒప్పందానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 85వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపీబీ నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలపగా.. నేరాలను నియంత్రించేందుకు పీడీ యాక్ట్ పటిష్టం చేస్తూ సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదించింది.
లోకాయుక్త చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసి... లోకాయుక్త నియామకంలో ప్రతిపక్ష నేత లేనప్పుడు ఏం చేయాలనేదానిపైన చర్చ జరిపింది. ఏపీ టవర్స్ లిమిటెడ్ను ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్లో విలీనం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ టవర్స్ లిమిటెడ్కు చెందిన మూలధనం, ఆస్తులు, అప్పుల బదలాయిస్తూ ప్రతిపాదించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నేరాలను నియంత్రించేందుకు పీడీ యాక్ట్ పటిష్టం చేస్తూ సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే, లోకాయుక్త చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. లోకాయుక్త నియామకంలో ప్రతిపక్ష నేత లేనప్పుడు ఏం చేయాలనే దానిపై భేటీలో చర్చించారు. పార్లమెంట్లో అనుసరించిన విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో రూ.85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపీబీ నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com