Andhra Pradesh : సముద్రంలో చేపల వేటను నిషేధించిన ఏపీ ప్రభుత్వం

Andhra Pradesh : సముద్రంలో  చేపల వేటను నిషేధించిన ఏపీ  ప్రభుత్వం
Andhra Pradesh : సముద్రంలో చేపల వేటను ప్రభుత్వం నిషేధించింది. ఈ నెల 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు ఇది అమలులో ఉంటుంది.

Andhra Pradesh : సముద్రంలో చేపల వేటను ప్రభుత్వం నిషేధించింది. ఈ నెల 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు ఇది అమలులో ఉంటుంది. మొత్తం 61 రోజులపాటు ఈనిషేధం అమలులో ఉండటంతో..ఈ సమయంలో మోటరైజ్డ్‌ బోట్లతో చేపల వేటకు వెళ్లకూడదు. ఒకవేళ వెళితే కఠిన చర్యలు తప్పవని, బోటుయజమానికి జరిమానా విధించడంతోపాటు... ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీ నిలిపివేస్తామని పశ్చిమ గోదావరిజిల్లా మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు కర్రి నాగలింగాచార్యులు తెలిపారు. వేసవి కాలంలో జీవనభృతి కల్పించడానికి 16 నుంచి నమోదు ప్రక్రియచేపట్టామని.. అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలి ఆయన వెల్లడించారు.

పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, మొగల్తూరు మండలాల్లో 19 కి. మీ. మేర తీరం విస్తరించి ఉంది. తొమ్మిది గ్రామాల్లో సుమారు 40 వేల మందికి పైగా మత్స్యకారులు ఉన్నారు. వీరిలో ఎక్కువ శాతం వేటపై ఆధారపడి జీవిస్తారు. 414 బోట్లు, పడవలు ప్రభుత్వ గుర్తింపు పొందాయి. నిషేధ కాలంలో మోటరైజ్డ్ బోట్లతో చేపల వేటకు వెళ్లకూడదు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయించిన బోట్లు, పడవలకు మాత్రమే వేట విరామ భత్యం అందుతుంది. ఇందు కోసం ఈ నెల 16న సర్వే చేపట్టారు. రెండు నెలల కాలానికి మత్సకారుల 10 వేలు చొప్పున ప్రభుత్వం అందిస్తుంది. గతేడాది 1,551 కుటుంబాలకు అందించారు.

అయితే 9 గ్రామాల్లో 200 కుటుంబాలు పరోక్షంగా,...3 వేల మందికిపైగా మోచేతి వలలతో వేట సాగిస్తున్నారు. వీరికి చేపల వేటనే జీవనాధారం. రెండు నెలలు వేట నిలిచిపోతే వీరంతా ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమయంలో గుర్తింపు పొందిన బోట్లు, పడవలపై వేట సాగించే వారికే కరవు భత్యం చెల్లిస్తున్నారు. దీంతో మిగతా వారు అనర్హులుగా మిగిలిపోతున్నారు. వారిని కూడా పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఆదుకోవాలని గుర్తింపు పొందని మత్స్యకారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

బోట్లు, పడవలు ప్రభుత్వ గుర్తింపు పొందాలంటే రిజిస్ట్రేషన్ తప్పని సరి. మెకనైజ్డ్ బోట్లకు కలర్ కోడ్ ఉంటుంది. బోటు పైభా గానికి పసుపు రంగు, కింద భాగానికి నీలి రంగు ఉండాలి.నమోదు ప్రక్రియ ప్రారంభించే నాటికి ప్రతి బోటుకు లైసెన్స్ మనుగడలో ఉండాలి. నమోదు సమయంలో లబ్దిదారుడికి రేషన్, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం ఉండాలి. గుర్తింపుపొందిన వారు నిషేధ సమయంలో వేటకు వెళితే కఠిన చర్యలు తీసుకుంటారు. బోటు యజమానికి జరిమానా విధించడంతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు నిలిపివేస్తారు.

Tags

Read MoreRead Less
Next Story