Ap Theatres : ధియేటర్ లకి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..!

X
By - /TV5 Digital Team |13 Oct 2021 8:45 PM IST
Ap Theatres : ఏపీలోని ధియేటర్ లకి సర్కార్ శుభవార్తని చెప్పింది. రాష్ట్రంలోని అన్నీ ధియేటర్ లలో వందశాతం ఆక్యుపెన్సీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
Ap Theatres : ఏపీలోని ధియేటర్ లకి సర్కార్ శుభవార్తని చెప్పింది. రాష్ట్రంలోని అన్నీ ధియేటర్ లలో వందశాతం ఆక్యుపెన్సీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇది రేపటి నుంచి అమల్లోకి వస్తుంది. దీనితో దసరా పండగ సందర్భంగా విడుదల కానున్న మహాసముద్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలకి కలిసి రానుంది. కాగా రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు రాత్రి కర్ఫ్యూ పొడిస్తున్నట్టు తెలిపింది. రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున అయిదు గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. దీనితో ధియేటర్ లలో నైట్ షోలకి అడ్డంకులు తొలిగిపోయాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com