ప్రభుత్వ పరిధిలోకి సంగం డైయిరీ..!

X
By - TV5 Digital Team |27 April 2021 3:45 PM IST
ముందుగా గుంటూరు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి బదిలీ చేసిన ప్రభుత్వం.. కాసేపటికే ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది.
గుంటూరు జిల్లా వడ్లమూడి వద్ద ఉన్న సంగం డెయిరీ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా గుంటూరు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి బదిలీ చేసిన ప్రభుత్వం.. కాసేపటికే ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. అనంతరం సంగం డెయిరీని ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలోని తీసుకొస్తూ మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. సంగం డెయిరీ రోజువారీ కార్యకలపాల బాధ్యత తెనాలి సబ్ కలెక్టర్కు అప్పగించారు.. ఆటంకం కలిగిస్తే చర్యలు తీసుకునే అధికారాలను సబ్కలెక్టర్కు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయంటూ చైర్మన్ గా ఉన్న టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను ఏసీబీ అరెస్ట్ చేయడం తెలిసిందే.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com