Andhra Pradesh : మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు

ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ఏపీ పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. వారం రోజుల నుంచి రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. దీంతో మార్చి మొదటి వారం నుంచే ఒంటిపూట బడుల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. దీనిపై విద్యాశాఖ ఎలా స్పందిస్తుందో చూడాలి.ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మాత్రమే తరగతులు నిర్వహించేందుకు స్థానిక అధికారులు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఒంటిపూట బడులను అమలు చేయాలా? లేక జిల్లాల వాతావరణ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలా? అనే దానిపై విద్యాశాఖ త్వరలో స్పష్టత ఇవ్వనుంది. విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com