AP Weather Update: బంగాళాఖాతంలో బలహీనపడ్డ అల్పపీడనం

నైరుతి ప్రాంతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనమైనప్పటికీ, ఆహార్యం వాతావరణశాఖ అంచనా ప్రకారం, రేపు (నవంబర్ 14) ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగామి రెండు రోజుల్లో (నవంబర్ 15, 16) కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు వెల్లడించారు.
వర్షాల కారణంగా, రైతులు వరికోతలు, ఇతర వ్యవసాయ పనులలో జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు వెళ్లేలా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని, పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని, అలాగే ఉద్యానవన పంటలను/చెట్లను పడిపోకుండా సపోర్టు అందించాలని కోరింది.
రేపు (నవంబర్ 14) కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. అలాగే అల్లూరి, కోనసీమ, పగో, ఏలూరు, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
తెలంగాణలో నిన్నటి వరకు పొడి వాతావరణం ఉన్నప్పటికీ, అల్పపీడనం ప్రభావం క్రమంగా రాష్ట్రంలో వాతావరణం మారుతోంది. నవంబర్ 13 నుండి, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నవంబర్ 16 వరకు రాష్ట్రంలో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. అయితే, 17వ తేదీ నుండి రాష్ట్రంలో మళ్లీ పొడి వాతావరణం నెలకొననుందని అంచనా వేసింది. హైదరాబాద్ వాతావరణం ప్రస్తుతం మేఘావృతంగా ఉండబోతోంది, , ఉపరితల గాలులు ఈశాన్య దిశలో వీచే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com