Parawada Pharma Company : పరవాడ ఫార్మా ప్రమాదంలో మరొకరు మృతి

X
By - Manikanta |26 Aug 2024 1:30 PM IST
అనకాపల్లి జిల్లాలోని పరవాడ ఫార్మాసిటీలో ప్రమాద ఘటనలో మరోకరు మృతి చెందారు. తీవ్ర గాయాలైన వారు ఒక్కొక్కరిగా మృత్యువాత పడుతున్నారు. ఇప్పటి వరకు చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురి మృతి చెందారు.
శ్రీకాకుళం వాసి కోరాడ సూర్యనారాయణ ఈరోజు ఉదయం మృతి చెందగా, నిన్న రాత్రి జార్ఖండ్ కు చెందిన లాల్ సింగ్ మృతి.. 24న రొయ్య అంగీర మృతి చెందారు. కాగా చికిత్స పొందుతున్న వారిలో మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com