AP : టీడీపీ సీనియర్ నేత కొల్లు రవీంద్ర అరెస్టు

X
By - Vijayanand |6 Feb 2023 5:44 PM IST
కోట్లాది రూపాయల విలువజేసే ప్రభుత్వ భూమిని వైసీపీ కార్యాలయానికి కేటాయించడాన్ని నిరసిస్తూ మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర నిరసన కార్యక్రమం చేపట్టారు
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కొల్లు రవీంద్ర అరెస్టు కలకలం రేపుతోంది.. ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కృష్ణా జిల్లా గూడూరు పీఎస్కు తరలించారు.. దీంతో పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్కు చేరుకుని ఆందోళన చేపట్టారు.. దీంతో పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. కొల్లు రవీంద్రను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కోట్లాది రూపాయల విలువజేసే ప్రభుత్వ భూమిని వైసీపీ కార్యాలయానికి కేటాయించడాన్ని నిరసిస్తూ మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర నిరసన కార్యక్రమం చేపట్టారు. అయితే, ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కొల్లు రవీంద్రను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com