AP: వైసీపీ ప్రభుత్వానికి వర్ల సవాల్

AP: వైసీపీ ప్రభుత్వానికి  వర్ల  సవాల్
జగనాసూర పుస్తకంపై మేము చర్చకు సిద్ధమే

వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య సవాల్ విసిరారు. జగనాసూర పుస్తకంపై తాము చర్చకు సిద్ధమన్నారు. దమ్ముంటే వైసీపీ నేతలు తమతో చర్చకు రావాలని సవాల్‌ చేశారు. వైసీపీ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. వివేకాను హత్య చేసింది ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వివేకా హత్యపై సీబీఐ విచారణ కోరిన జగన్ అధికారంలోకి రాగానే పిటీషన్ ఎందుకు విత్ డ్రా చేసుకున్నారని ప్రశ్నించారు. వివేకా హత్య కేసు జగన్ మెడకు చుట్టుకుంటుందనే ఉద్దేశంతోనే పిటిషన్‌ను విత్ డ్రా చేసుకున్నారని వర్ల రామయ్య ఆరోపించారు.


Tags

Next Story