AP : ఈరోజు టీడీపీలో చేరనున్న కన్నా లక్ష్మీనారాయణ

AP : ఈరోజు టీడీపీలో చేరనున్న కన్నా లక్ష్మీనారాయణ
గుంటూరు కన్నావారితోటలోని ఆయన నివాసం నుంచి టీడీపీ కేంద్ర కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు

మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో అనుచరులతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ సందర్భంగా ఇవాళ మధ్యాహ్నం కన్నా అనుచరులు, అభిమానులు గుంటూరు కన్నావారితోటలోని ఆయన నివాసం నుంచి టీడీపీ కేంద్ర కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ సందర్భంగా నగరంలో పలు కూడళ్లలో కన్నా లక్ష్మీనారాయణ ఫొటోలతో తెలుగుదేశం ఫ్లెక్సీలు భారీగా వెలిశాయి. అనుచరులందరూ టీడీపీలోకి ఆహ్వానిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో సీనియర్‌ నేత అయిన కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో పార్టీ మారాలని భావించారు. ఈ నిర్ణయం కొద్ది నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా రాజకీయాల్లో పెను మార్పులకు నాంది కానుంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ..ఈ నెల 16న కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీకి రాజీనామా చేశారు. మోదీ నాయకత్వంపై నమ్మకం ఉన్నా.. సోము వీర్రాజు వ్యవహారశైలిపై బాహాటంగానే విమర్శలు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story