AP : రాష్ట్ర భవిష్యత్తు కోసమే టీడీపీలో చేరాను : కన్నా లక్ష్మీనారాయణ

X
By - Vijayanand |23 Feb 2023 5:03 PM IST
అమరావతి అయితే అభివృద్ధి చేయాలి.. విశాఖ అయితే దోచుకోవచ్చని జగన్ ప్లాన్ చేసారని కన్నా ఆరోపించారు
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసమే టీడీపీలో చేరానని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కన్నా.. ఏపీలో రాక్షస పాలన సాగుతోందని జగన్పై ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు జగన్ అరాచక పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. అమరావతిని అభివృద్ధి చేయకుండా మూడు రాజధానులని మాట మార్చారని ధ్వజమెత్తారు. అమరావతి అయితే అభివృద్ధి చేయాలి.. విశాఖ అయితే దోచుకోవచ్చని జగన్ ప్లాన్ చేసారని కన్నా ఆరోపించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కండువా కప్పి కన్నా లక్ష్మీనారాయణను టీడీపీలోకి ఆహ్వానించారు. కన్నాతో పాటు దాదాపు 3 వేల మంది కార్యకర్తలు టీడీపీలోకి చేరారు. వారిందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com