AP: రైతు భరోసా పేరుతో రైతులను నిలువునా ముంచేశారు

AP: రైతు భరోసా పేరుతో రైతులను నిలువునా ముంచేశారు
జగన్ పాలనలో మూడు వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్న కొల్లు రవీంద్ర

రైతులను జగన్ మోహన్ రెడ్డి నిలువునా దోచుకుంటున్నారని టీడీపీ నేత కొల్లు రవీంద్ర ఆరోపించారు. రైతు భరోసా పేరుతో రైతులను నిలువునా ముంచేశారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అన్నారు. జగన్ పాలనలో మూడు వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. మరిన్ని అప్పుల కోసం మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరి బిగిస్తున్నారని ఆరోపించారు కొల్లు రవీంద్ర.

Tags

Next Story