AP: నేడే టీడీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర స్థాయి సదస్సు

AP: నేడే టీడీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర స్థాయి సదస్సు
నాలుగేళ్లలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై నమోదైన కేసులపై చర్చ

ఈరోజు(శనివారం) మంగళగిరి సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో టీడీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర స్థాయి సదస్సు జరగనున్నది. పోసాని వెంకటేశ్వర్లు అధ్యక్షత జరగనున్న లీగల్‌ సెల్‌ సదస్సుకు.. టీడీపీ అధినేత చంద్రబాబు హాజరుకానున్నారు. నాలుగేళ్లలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై నమోదైన కేసులపై చర్చించనున్నారు. నారా లోకేష్‌ పాదయాత్రకు ప్రభుత్వం ప్రతిబంధకాలపై చర్చించనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న ఈ సమావేశాన్ని ఉద్దేశించి మధ్నాహ్నం చంద్రబాబు ప్రసంగించనున్నారు. లీగల్‌ సెల్‌ భేటీకి అన్ని జిల్లాల నుంచి న్యాయవాదులు హాజరవుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story