AP: తిరుపతి జిల్లాలో పోలీసులు ఓవరాక్షన్
By - Subba Reddy |7 March 2023 8:15 AM GMT
యువగళం పాదయాత్రలో టీడీపీ కండువా కప్పుకున్నారన్న అక్కసుతో అక్రమంగా కేసులు
తిరుపతి జిల్లాలో మరోసారి పోలీసులు ఓవరాక్షన్ చేశారు. కలికిరిలో టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. యువగళం పాదయాత్రలో టీడీపీ కండువా కప్పుకున్నారన్న అక్కసుతో అక్రమంగా కేసులు పెట్టారు. యువగళం పాదయాత్రలో లోకేష్ సమక్షంలో, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా టీడీపీ కండువా కప్పుకున్నారు వైసీపీ నేతలు. దాదాపు 1500 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరారు. వీరిలో సీనియర్ నేత, కలికిరి సర్పంచ్ ప్రతాప్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే బాణ సంచా పేల్చి ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కేసు పెట్టారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com