AP: జంట హత్యల కేసులో కీలక విషయాలు.. అనుమానంతోనే హత్య

AP: జంట హత్యల కేసులో కీలక విషయాలు.. అనుమానంతోనే హత్య
భార్యపై దాడి చేసే క్రమంలో అత్త,మామ అడ్డు రావడంతో వారిపై కూడా దాడి

కర్నూలు జిల్లాలో (నిన్న) మంగళవారం జరిగిన నవ వధువు హత్యకేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. భార్యపై అనుమానంతోనే శ్రవణ్‌ హత్యేచేసినట్లు పోలీసులు బావిస్తున్నారు. భార్యపై దాడి చేసే క్రమంలో అత్త,మామ అడ్డు రావడంతో వారిపై కూడా దాడి చేశాడు. దీంతో అత్త రమాదేవి కూడా అక్కడికక్కడే మృతి చెందింది. వధువు రుక్మిణి తన ప్రియుడు గంగాధర్‌తో చాటింగ్‌ చేయడంతో అనుమానం వచ్చిన శ్రవణ్‌ ఆమె ఫోన్‌ ట్రాక్‌ చేసి ఆడియోలు విన్నాడు. అందులో భర్త సంసారానికి పనికిరాడని ప్రచారం చేసింది. దీంతో హత్య చేసేందుకు నిర్ణయించుకున్నాడు నిందితుడు శ్రవణ్. ఈ క్రమంలోనే తన తండ్రి ప్రసాద్‌ అతన్ని ప్రోత్సహించాడు. శ్రవణ్‌తో పాటు అతని తండ్రి ప్రాసాద్‌ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. అయితే వారి మృతదేహాలను తీసుకు వెళ్లేందుకు ఎవరూ రావడంలేదని దీంతో పోలీసులే అంత్యక్రియలు నిర్వహించాల్సి వస్తోందని కర్నూలు డీఎస్పీ వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story