AP : బీజేపీ నేతలతో పవన్ వరుస సమావేశాలు

AP : బీజేపీ నేతలతో పవన్ వరుస సమావేశాలు
అందరిని కలసిన తర్వాత అన్ని విషయాలు చెప్తామన్నారు పవన్‌

ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌... బీజేపీ పెద్దలతో వరుస భేటీల్లో పాల్గొంటున్నారు. కొద్ది సేపటి క్రితం ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్‌ మురళీధరన్‌తో భేటీ ముగిసింది. ఈ భేటిలో బీజేపీ జాయింట్‌ జనరల్‌ సెక్రటరీ శివప్రకాశ్‌ కూడా ఉన్నారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. అనంతరం... మురళీధరన్‌ ఇంటి నుంచి వెళ్లిపోయారు కళ్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌. ఇంకా సమావేశాలు ఉన్నాయని.. అందరిని కలసిన తర్వాత అన్ని విషయాలు చెప్తామన్నారు పవన్‌.

Tags

Read MoreRead Less
Next Story