AP : ఉత్తరాంధ్ర ప్రజలను వైసీపీ దోచుకుంది : బుద్ధా వెంకన్న

AP : ఉత్తరాంధ్ర ప్రజలను వైసీపీ దోచుకుంది : బుద్ధా వెంకన్న

ఉత్తరాంధ్ర ప్రజలను వైసీపీ దోచుకుందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. రేపు విశాఖలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన బుద్ధా వెంకన్న... 50వేల కోట్ల రూపాయల విలువైన భూములను విజయసాయిరెడ్డి కొట్టేశారని ఆరోపించారు. 2024లో 1994 ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయని.. బుధవారం జరగబోయే క్లస్టర్ల సమావేశం విజయ శంఖారావమన్నారు. చంద్రబాబు పర్యటన నూతన ఉత్తేజం మధ్య కొనసాగుతుందన్న గంటా శ్రీనివాసరావు.. జగన్ జరిపిన రివ్యూలో ఎక్కడా హెచ్చరికలు లేవని, బుజ్జగింపులే చూశామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story