AP : వివేక హత్య కేసులో కొనసాగుతోన్న విచారణ

AP : వివేక హత్య కేసులో కొనసాగుతోన్న విచారణ
ఈ నెల 30 లోపు దర్యాప్తు ముగించాలని సుప్రీంకోర్టు ఆదేశించి నేపథ్యంలో.... సిట్‌ తమ దర్యాప్తును వేగవంతం చేసింది

వివేక హత్య కేసులో సీబీఐ సిట్‌ విచారణ కొనసాగుతోంది. సీబీఐ డీఐజీ RK చౌరాషియా నేతృత్వంలోని సిట్‌ టీం ఇవాళ హైదారాబాద్‌ చేరుకుంది. ఈ నెల 30 లోపు దర్యాప్తు ముగించాలని సుప్రీంకోర్టు ఆదేశించి నేపథ్యంలో.... సిట్‌ తమ దర్యాప్తును వేగవంతం చేసింది. సిట్‌ బృందంలో ఎస్పీ వికాస్‌సింగ్‌, అడిషనల్‌ ఎస్పీ ముఖేష్‌ కుమార్‌, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌.శ్రీమతి, నవీన్‌ పునినాయా, ఎస్సై అంకిత్‌ యాదవ్‌లు హైదరాబాద్‌కు చేరుకుని తమ దర్యాప్తు ముమ్మరం చేశారు. మరోవైపు.. గంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించింది సీబీఐ. దీంతో నేడు సీబీఐ ఎదుట హాజరు కానున్నారు ఎర్రగంగిరెడ్డి. ఆయన్ను సీబీఐ SP వికాస్‌ సింగ్‌ విచారించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story