AP : గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఓ బూటకం : నాదెండ్ల మనోహర్

AP : గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఓ బూటకం : నాదెండ్ల మనోహర్
కోడిగుడ్డును సీ-పూడ్స్‌లో కలిపి చూపడాన్ని బట్టి.. మంత్రులు ఎంత అవివేకంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. తాము ఇన్వెస్టర్లను తప్పు పట్టడం లేదని, వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నామన్నారు

విశాఖపట్టణం వేదికగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఒక బూటకమని, అంకెల గారడీతో వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. సీ-పూడ్స్ ఎగుమతుల్లో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

కోడిగుడ్డును సీ-పూడ్స్‌లో కలిపి చూపడాన్ని బట్టి.. మంత్రులు ఎంత అవివేకంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. తాము ఇన్వెస్టర్లను తప్పు పట్టడం లేదని, వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నామన్నారు. గ్లోబల్ సమ్మిట్ పేరుతో 170 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. చిత్తశుద్ధితో పనులు చేస్తే..మెరుగైన పెట్టుబడులు వస్తాయని,అందుకు జనసేన పార్టీ మద్దతుగా ఉంటుందని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story