AP : సమ్మిట్ అంతా వైసీపీ రంగులే : పల్లా శ్రీనివాస్
By - Vijayanand |5 March 2023 8:33 AM GMT
ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ప్రభుత్వం జిమ్మిక్కులు చేస్తుందని అన్నారు.అసలు ఇండ్రస్ట్రీయల్ పాలసీ లేకుండానే సమ్మిట్ నిర్వహించడం అనేక అనుమానాలను రేకెత్తిస్తోందని అన్నారు
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అంతా వైసీపీ రంగులే అన్నారు విశాఖ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. మూడున్నరేళ్ల తరువాత ప్రభుత్వం కళ్లు తెరిచిందా అంటూ మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ప్రభుత్వం జిమ్మిక్కులు చేస్తుందని అన్నారు.అసలు ఇండ్రస్ట్రీయల్ పాలసీ లేకుండానే సమ్మిట్ నిర్వహించడం అనేక అనుమానాలను రేకెత్తిస్తోందని అన్నారు. పారిశ్రామికవెత్తలను మభ్యపెడుతున్నారని పల్లా అన్నారు.రాష్ట్రం నుంచి కంపెనీలను వెళ్లగొట్టిన ప్రభుత్వం ఏపీ బ్రాండ్ను దిగజార్చిందన్నారు. వచ్చిన డెలిగేట్స్కు కూడా లంచ్ పెట్టలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com