AP : కృష్ణా జిల్లాలో డ్వాక్రా కుంభకోణం

AP : కృష్ణా జిల్లాలో డ్వాక్రా కుంభకోణం

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో డ్వాక్రా కుంభకోణం వెలుగులోకి వచ్చింది. నాగాయలంకలోని శ్రీదుర్గా గ్రామైక్య సంఘంలో కోటి రూపాయలకు పైగా స్వాహా చేసినట్లు తెలుస్తోంది. కరోనా సమయంలో బ్యాంకులోని స్త్రీ నిధి సొమ్ము 52లక్షలు గోల్‌మాల్‌ అయినట్లు సమాచారం. పొదుపు, వడ్డీలు 40లక్షలు కూడా వేరే ఖాతాలకు మళ్లించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో డ్వాక్రా కార్యాలయం ముందు బాధిత మహిళలు ధర్నా చేపట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు తెలిపారు.

బుక్‌ కీపర్‌ వీవో సొమ్ము భర్త అకౌంట్‌కు మళ్లించిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సొమ్ముతో ఇల్లు కట్టుకుని.. రెండు ట్రాక్టర్లు కొనుక్కుందని అంటున్నారు. సస్పెండ్‌ అయిన సీసీతో పాటు అప్పటి బ్యాంకు మేనేజర్‌ను కూడా బాధ్యుడిని చేయాలని నినాదాలు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story