AP : "వివేకా హత్య కేసును డైవర్ట్ చేయడానికే రాజధానుల నాటకం"

AP : వివేకా హత్య కేసును డైవర్ట్ చేయడానికే రాజధానుల నాటకం

వివేకా హత్య కేసును డైవర్ట్ చేయడానికే మూడు రాజధానుల నాటకానికి తెరలేపారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. నెల్లూరులో నిర్వహించిన జోన్- 4 బీసీ అఖిలపక్ష సదస్సులో పాల్గొన్న అచ్చెన్నాయుడు.. డైవర్షన్ పాలిటిక్స్ నడపడం జగన్‌కు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన సీఎం రాజ్యాంగానికి లోబడి వ్యవహరించాలని.. జగన్ మాత్రం అలా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. ఇక టీడీపీ పుట్టి 40 ఏళ్లు పూర్తి చేసుకుందని.. బలహీన వర్గాలకి ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తూ ముందుకు సాగిందన్నారు. ఏపీలో దాదాపు 140 కులాలు ఉన్నాయని.. అయితే అందులో ఎన్నో కులాలు వెనకబడి ఉన్నాయన్నారు. బలహీన వర్గాలు ఎదగాలనేదే చంద్రబాబు నినాదం అన్న అచ్చెన్నాయుడు.. జగన్ కు మాత్రం అది ఇష్టం లేదని మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story