AP : పొత్తులపై ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు

X
By - Vijayanand |14 May 2023 4:28 PM IST
పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ జీవీఎల్. ప్రస్తుతం బీజేపీ, జనసేన పొత్తుల్లో ఉన్నామని, అయితే టీడీపీని కలుపుకోవాలనే ప్రతిపాదన పవన్ కల్యాణ్ తీసుకొచ్చారన్నారు. అదే విషయాన్ని కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. పవన్ సైతం మాట్లాడుతున్నాడన్నారు. పొత్తులపై అంతిమ నిర్ణయం కేంద్ర నాయకత్వానిదేనన్నారు జీవీఎల్. ఇక ముందస్తు ఎన్నికలపై వస్తున్న కథనాలు విశ్వసనీయ సమాచారంగా భావిస్తున్నట్లు తెలిపారు. అయితే.. వైసీపీ ప్రభుత్వం.. దీనికి సిద్ధంగా ఉందో లేదీ చూడాలన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com