AP: దేశ వ్యవసాయానికి ఏపీ కీలక కేంద్రం: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్

AP: దేశ వ్యవసాయానికి ఏపీ కీలక కేంద్రం: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్
X
ఏపీ హార్టికల్చర్‌ హబ్‌గా మారుతోందని వెల్లడి

దేశ వ్య­వ­సాయ రం­గం­లో ఆం­ధ్ర­ప్ర­దే­శ్ కీలక పా­త్ర పో­షి­స్తోం­ద­ని కేం­ద్ర గ్రా­మీ­ణా­భి­వృ­ద్ధి, వ్య­వ­సాయ శాఖ మం­త్రి శి­వ­రా­జ్ సిం­గ్ చౌ­హా­న్ స్ప­ష్టం చే­శా­రు. దే­శ­వ్యా­ప్తం­గా వ్య­వ­సాయ ఉత్ప­త్తి­లో ఆం­ధ్ర­ప్ర­దే­శ్ వాటా సు­మా­రు 10 శాతం వరకు ఉం­ద­ని ఆయన వె­ల్ల­డిం­చా­రు. ది­ల్లీ పర్య­ట­న­లో ఉన్న ఏపీ ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు నా­యు­డు­తో జరి­గిన భే­టీ­లో ఈ అం­శా­లు చర్చ­కు వచ్చా­యి. ఈ సమా­వే­శం­లో రా­ష్ట్రం­లో వ్య­వ­సా­యం, అను­బంధ రం­గాల అభి­వృ­ద్ధి­కి ప్ర­భు­త్వం తీ­సు­కుం­టు­న్న చర్య­ల­ను సీఎం చం­ద్ర­బా­బు కేం­ద్ర మం­త్రి­కి వి­వ­రిం­చా­రు. ము­ఖ్యం­గా పీఎం ప్ర­ణా­మ్ పథకం కింద ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో అమలు చే­స్తు­న్న కమ్యూ­ని­టీ మే­నే­జ్డ్ నే­చు­ర­ల్ ఫా­ర్మిం­గ్‌­ను మరింత వి­స్త­రిం­చేం­దు­కు కేం­ద్రం నుం­చి తగిన ని­ధు­లు వి­డు­దల చే­యా­ల­ని కో­రా­రు. రసా­యన ఎరు­వుల వి­ని­యో­గా­న్ని తగ్గి­స్తూ, సేం­ద్రియ సాగు వైపు రై­తు­ల­ను ప్రో­త్స­హి­స్తు­న్న నే­ప­థ్యం­లో, ఆ తగ్గిం­పు­కు అను­గు­ణం­గా కేం­ద్రం నుం­చి ప్రో­త్సా­హ­కా­లు అం­దిం­చా­ల­ని వి­జ్ఞ­ప్తి చే­శా­రు. 2024–25 ఆర్థిక సం­వ­త్స­రా­ని­కి సం­బం­ధిం­చి సు­మా­రు రూ.216 కో­ట్ల మేర ని­ధు­లు మం­జూ­రు చే­యా­ల­ని సీఎం చం­ద్ర­బా­బు కో­రి­న­ట్లు సమా­చా­రం. రా­ష్ట్రం­లో సా­గు­లో రసా­య­నాల వి­ని­యో­గం ఇప్ప­టి­కే 2.28 శాతం మేర తగ్గిం­ద­ని ఆయన కేం­ద్ర మం­త్రి­కి వి­వ­రిం­చా­రు.

ఆంధ్రప్రదేశ్‌లో కొబ్బరి సాగు అభివృద్ధికి కేంద్ర సహకారం అవసరమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇందుకోసం సుమారు రూ.200 కోట్ల ఆర్థిక సాయం చేయాలని కోరారు. కోకోనట్ ప్రాసెసింగ్ పార్కుల ఏర్పాటు, కర్ణాటక తరహాలో ఆధునిక టెండర్ కొబ్బరి మార్కెట్ల స్థాపన, కొబ్బరి రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై శిక్షణ, నర్సరీల విస్తరణ వంటి అంశాల్లో కేంద్రం తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే సమావేశంలో ఏపీలో మఖానా డెవలప్‌మెంట్ బోర్డు ఏర్పాటు ప్రతిపాదనను కూడా సీఎం ప్రస్తావించారు. కొల్లేరు సరస్సు పరిసర ప్రాంతాల్లో సుమారు 50 వేల ఎకరాల్లో మఖానా సాగుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని, రైతులకు తగిన ప్రోత్సాహకాలు అందిస్తే ఇది మంచి ఆదాయ వనరుగా మారుతుందని వివరించారు. వ్యవసాయం, మత్స్యరంగం, పశుపోషణ రంగాల అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని, ఇందుకోసం ప్రత్యేక బృందాన్ని కూడా నియమించినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. సేంద్రియ సాగు, పామాయిల్ ఉత్పత్తిలో ఏపీ మంచి ఫలితాలు సాధిస్తోందని ప్రశంసిస్తూ, ఈ రంగాల విస్తరణకు కేంద్రం పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.

Tags

Next Story