ap: ఏపీ ప్రభుత్వంలో మరో కొత్త శాఖ..?

ap: ఏపీ ప్రభుత్వంలో మరో కొత్త శాఖ..?
X
సర్కార్ గ్రీన్ సిగ్నల్ !

ఆం­ధ్ర­ప్ర­దే­శ్ ప్ర­భు­త్వం­లో మరో కొ­త్త శా­ఖ­కు సర్కా­ర్ గ్రీ­న్ సి­గ్న­ల్ ఇచ్చి­న­ట్టు సమా­చా­రం. రా­ష్ట్రా­న్ని గ్రీ­న్ హై­డ్రో­జ­న్ వ్యా­లీ­గా రూ­పొం­దిం­చే లక్ష్యం­తో డి­పా­ర్ట్మెం­ట్ ఆఫ్ సై­న్స్ అండ్ టె­క్నా­ల­జీ పే­రు­తో కొ­త్త శా­ఖ­ను ఏర్పా­టు చే­యా­ల­ని ప్ర­భు­త్వం ఆలో­చి­స్తోం­ది. ప్ర­స్తు­తం సై­న్స్ అండ్ టె­క్నా­ల­జీ పర్యా­వ­ర­ణం, అటవీ శా­ఖ­లో ఒక సబ్జె­క్టు­గా ఉన్న­ప్ప­టి­కీ, గ్రీ­న్ హై­డ్రో­జ­న్ ఉత్ప­త్తి, రీ­సె­ర్చ్, ఇన్నో­వే­ష­న్‌­ల­ను వే­గ­వం­తం చే­సేం­దు­కు దీ­ని­ని స్వ­తం­త్ర శా­ఖ­గా మా­ర్చా­ల­ని ప్ర­భు­త్వం ని­ర్ణ­యిం­చి­న­ట్లు సమా­చా­రం. జులై 19న అమ­రా­వ­తి­లో సీఎం చం­ద్ర­బా­బు అధ్య­క్ష­తన జరి­గిన గ్రీ­న్ హై­డ్రో­జ­న్ సమ్మి­ట్‌­లో ఈ ఆలో­చ­న­ను వె­ల్ల­డిం­చా­రు. ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­ను 2030 నా­టి­కి భా­ర­త­దేశ గ్రీ­న్ హై­డ్రో­జ­న్ రా­జ­ధా­ని­గా తీ­ర్చి­ది­ద్దే లక్ష్యం­తో SRM యూ­ని­వ­ర్శి­టీ-APని నో­డ­ల్ ఏజె­న్సీ­గా ని­య­మిం­చ­ను­న్నా­రు. 5 గి­గా­వా­ట్ల ఎల­క్ట్రో­లై­జ­ర్ ఉత్ప­త్తి సా­మ­ర్థ్యం, 1.5 మి­లి­య­న్ మె­ట్రి­క్ టన్నుల గ్రీ­న్ హై­డ్రో­జ­న్ ఉత్ప­త్తి­తో 25 గి­గా­వా­ట్ల గ్రీ­న్ ఎన­ర్జీ కా­రి­డా­ర్ ఏర్పా­టు­ను లక్ష్యం­గా పె­ట్టు­కు­న్నా­రు.

డిక్లరేషన్‌ను ప్రకటించిన చంద్రబాబు

దే­శం­లో­నే అతి పె­ద్ద గ్రీ­న్‌ హై­డ్రో­జ­న్‌ తయా­రీ కేం­ద్రం­గా రా­ష్ట్రా­న్ని తీ­ర్చి­ది­ద్దే లక్ష్యం­తో ‘అమ­రా­వ­తి గ్రీ­న్‌ హై­డ్రో­జ­న్‌ వ్యా­లీ- అమ­రా­వ­తి డి­క్ల­రే­ష­న్‌’ను చం­ద్ర­బా­బు ఇప్ప­టి­కే ప్ర­క­టిం­చా­రు. 2030 నా­టి­కి గ్రీ­న్‌ హై­డ్రో­జ­న్‌ వ్యా­లీ­గా రా­ష్ట్రా­న్ని తీ­ర్చి­ది­ద్దేం­దు­కు వ్యూ­హా­త్మక ప్ర­ణా­ళి­క­ను వె­ల్ల­డిం­చా­రు. ఈ రం­గం­లో పరి­శో­ధన, ఆవి­ష్క­ర­ణ­కు రూ.500 కో­ట్ల­ను కే­టా­యి­స్తు­న్న­ట్లు తె­లి­పా­రు. ‘శు­ద్ధ ఇంధన, గ్రీ­న్‌ హై­డ్రో­జ­న్‌ తయా­రీ వి­ధా­నా­ల­ను తీ­సు­కు­రా­వ­డ­మే డి­క్ల­రే­ష­న్‌ ప్ర­ధాన లక్ష్యం. దీ­ని­కో­సం రా­ష్ట్రం­లో గ్రీ­న్‌ ఎన­ర్జీ కా­రి­డా­ర్‌ అభి­వృ­ద్ధి చే­స్తాం. గ్రీ­న్‌ హై­డ్రో­జ­న్‌ ఉత్ప­త్తి పెం­చేం­దు­కు అను­కూల పరి­స్థి­తు­ల­ను కల్పి­స్తాం’ అని సీఎం పే­ర్కొ­న్నా­రు. అమ­రా­వ­తి­లో­ని ఎస్‌­ఆ­ర్‌­ఎం వి­శ్వ­వి­ద్యా­ల­యం­లో ఇటీ­వల జరి­గిన ‘గ్రీ­న్‌ హై­డ్రో­జ­న్‌ సమి­ట్‌-2025’లో పా­రి­శ్రా­మిక ని­పు­ణు­లు, భా­గ­స్వా­మ్య­ప­క్షా­లు కలి­పి సు­మా­రు 600 మంది పా­ల్గొ­న్నా­రు.

Tags

Next Story