AP: ముప్పు వేళ అప్రమత్తంగా ఏపీ సర్కార్

AP: ముప్పు వేళ అప్రమత్తంగా ఏపీ సర్కార్
X
ఒక్క ప్రాణమూ పోవద్దన్న చంద్రబాబు

తు­పా­ను తీ­వ్రత దృ­ష్ట్యా ప్ర­భు­త్వం అప్ర­మ­త్త­మైం­ది. ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు, ఉప­ము­ఖ్య­మం­త్రి పవ­న్‌ కల్యా­ణ్, మం­త్రు­లు అధి­కా­రు­ల­తో సమీ­క్ష­లు ని­ర్వ­హిం­చా­రు. గా­లు­ల­కు వి­ద్యు­త్తు స్తం­భా­లు, వై­ర్లు తెగి పడే అవ­కా­శం ఉం­డ­డం­తో సర­ఫ­రా పు­న­రు­ద్ధ­రణ కోసం 1,000 ప్ర­త్యేక బృం­దా­ల­తో 12,000 మంది సి­బ్బం­ది­ని ప్ర­భు­త్వం ప్ర­త్యే­కం­గా ని­య­మిం­చిం­ది. ఎక్క­డా ఎలాం­టి ప్ర­మా­దా­లు జర­గ­కుం­డా చూ­డా­ల­ని, ఎలాం­టి ప్రా­ణ­న­ష్టం సం­భ­విం­చ­కుం­డా చూ­డా­ల­ని సీఎం చం­ద్ర­బా­బు అధి­కా­రు­ల­ను ఆదే­శిం­చా­రు. కేం­ద్రం నుం­చి అవ­స­ర­మైన సహాయ సహ­కా­రా­ల­ను అం­ది­స్తా­మ­ని ప్ర­ధా­ని మోదీ హామీ ఇచ్చి­న­ట్లు ఆయన తె­లి­పా­రు. ప్ర­ధా­ని కా­ర్యా­ల­యం­తో సమ­న్వయ బా­ధ్య­త­ను మం­త్రి లో­కే­శ్‌­కు అప్ప­గిం­చా­రు. పంట నష్ట­పో­కుం­డా టా­ర్పా­లి­న్లు అం­దు­బా­టు­లో ఉం­చా­ల­ని ఆయన ఆదే­శిం­చా­రు.

ప్రమాదాలు జరగొద్దు

మొం­థా తు­పా­ను కా­ర­ణం­గా ఎక్క­డా ప్ర­మా­దా­లు జర­గ­కుం­డా చూ­డా­ల­ని, ఒక్క మర­ణ­మూ సం­భ­విం­చ­కూ­డ­ద­నే­ది ప్ర­భు­త్వ లక్ష్య­మ­ని ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు స్ప­ష్టం చే­శా­రు. తు­పా­ను ప్ర­భా­వం­తో రా­ష్ట్రం­లో­ని పరి­స్థి­తు­ల­పై ప్ర­ధా­ని మోదీ ఆరా తీ­శా­ర­ని.. కేం­ద్రం నుం­చి సహాయ సహ­కా­రా­లు అం­దిం­చేం­దు­కు సి­ద్ధ­మ­ని భరో­సా ఇచ్చా­ర­ని వె­ల్ల­డిం­చా­రు. ప్ర­ధా­ని కా­ర్యా­ల­యం­తో సమ­న్వ­యం చే­సు­కు­నే బా­ధ్య­త­ను మం­త్రి లో­కే­శ్‌­కు అప్ప­గిం­చా­రు. తు­పా­ను రక్షణ వి­ధు­ల్లో అల­స­త్వం వహిం­చే వా­రి­పై చర్య­లు తప్ప­వ­ని హె­చ్చ­రిం­చా­రు. ఆయన తు­పా­ను సన్నా­హక చర్య­లు, జి­ల్లా­ల్లో పరి­స్థి­తు­ల­పై ఆర్టీ­జీ­ఎ­స్‌­లో సమీ­క్ష ని­ర్వ­హిం­చా­రు. ప్ర­తి గం­ట­కు తు­పా­ను బు­లె­టి­న్లు ఇస్తూ అప్ర­మ­త్తం చే­యా­లి. తు­పా­ను ప్ర­భా­వం అధి­కం­గా ఉండే 2,707 గ్రామ/ వా­ర్డు సచి­వా­ల­యాల పరి­ధి­లో ప్ర­త్యేక చర్య­లు చే­ప­ట్టా­లి. 110 మం­డ­లా­ల్లో­ని సచి­వా­ల­యా­ల్లో ఉన్న 3,211 జన­రే­ట­ర్ల­ను పవ­ర్‌ బ్యా­క­ప్‌ కోసం వి­ని­యో­గిం­చు­కో­వా­లి. కమ్యూ­ని­కే­ష­న్‌ వ్య­వ­స్థ­కు అం­త­రా­యం లే­కుం­డా చూ­డా­లి. ప్ర­త్యేక మొ­బై­ల్‌ టవ­ర్లు ఏర్పా­టు చే­యా­లి. శా­టి­లై­ట్‌ ఫో­న్లు ఉప­యో­గిం­చా­లి’ అని ఆదే­శిం­చా­రు. తు­పా­ను­ల్ని ఎదు­ర్కొ­నేం­దు­కు కూడా ముం­దు­గా­నే ప్ర­ణా­ళి­క­లు రూ­పొం­దిం­చా­ల­ని సూ­చిం­చా­రు.

అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలు

మొం­థా తు­పా­ను నే­ప­థ్యం­లో అప్ర­మ­త్తం­గా ఉం­డా­ల­ని ఆం­ధ్ర­ప్ర­దే­శ్ ఉప ము­ఖ్య­మం­త్రి పవన్ కల్యా­ణ్ అధి­కా­రు­ల­కు ది­శా­ని­ర్దే­శం చే­శా­రు. మొం­థా తు­పా­ను కా­కి­నాడ ప్రాం­తం­లో తీరం దా­ట­నుం­ద­ని తె­లి­పా­రు. ఈ క్ర­మం­లో కా­కి­నాడ జి­ల్లా­లో చే­ప­ట్టా­ల్సిన చర్య­ల­పై పవన్ కల్యా­ణ్ తన క్యాం­పు కా­ర్యా­ల­యం­లో­వీ­డి­యో కా­న్ప­రె­న్స్ ద్వా­రా సమీ­క్షా సమా­వే­శం ని­ర్వ­హిం­చా­రు. ఈ సమీ­క్ష­కు కా­కి­నాడ జి­ల్లా ఇన్‌­చా­ర్జి మం­త్రి పి. నా­రా­యణ, స్పె­ష­ల్ ఆఫీ­స­ర్ కృ­ష్ణ­తేజ, జి­ల్లా కలె­క్ట­ర్ షాన్ మో­హ­న్, ఎస్పీ బిం­దు మా­ధ­వ్, అధి­కా­రు­లు హా­జ­ర­య్యా­రు.

కా­కి­నాడ జి­ల్లా­లో 12 మం­డ­లా­ల­పై మొం­థా తు­పా­ను ప్ర­భా­వం ఉం­టుం­ద­ని తె­లి­సిన క్ర­మం­లో ముం­ద­స్తు చర్య­లు పక­డ్బం­దీ­గా ఉం­డా­ల­ని సూ­చిం­చా­రు పవన్ కల్యా­ణ్. ప్ర­భా­విత ప్రాం­తా­ల్లో ఉన్న­వా­రి­ని సు­ర­క్షిత ప్రాం­తా­ల­కు తర­లిం­చ­డం­తో­పా­టు వా­రి­కి అవ­స­ర­మైన ఆహా­రం, రక్షిత తా­గు­నీ­రు, పాలు, ఔష­ధా­లు సమ­కూ­ర్చు­కో­వా­ల­ని మా­ర్గ­ని­ర్దే­శం చే­శా­రు. డి­జా­స్ట­ర్ రె­స్పా­న్స్ ఫో­ర్స్ బృం­దా­లు, గజ ఈత­గా­ళ్లు సి­ద్ధం­గా ఉన్నా­ర­ని చె­ప్పు­కొ­చ్చా­రు. ప్ర­జ­లు ఎలాం­టి ఆం­దో­ళ­న­కి గు­రి­కా­కుం­డా చర్య­లు చే­ప­ట్టా­ల­ని ఆదే­శిం­చా­రు. మొం­థా తు­పా­ను తీరం దాటే సమ­యం­లో గా­లుల తీ­వ్రత ఎక్కు­వ­గా ఉన్నం­దున వి­ద్యు­త్ స్తం­భా­లు పడి­పో­యే అవ­కా­శం ఉం­టుం­ద­ని తె­లి­పా­రు.




Tags

Next Story