AP: ఏపీ లిక్కర్ స్కాం.. 8 చోట్ల ఈడీ సోదాలు

AP: ఏపీ లిక్కర్ స్కాం.. 8 చోట్ల ఈడీ సోదాలు
X
వైఎస్‌ అనిల్‌రెడ్డి కంపెనీల్లో సిట్‌ సోదాలు

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం సంభవించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోదరుడైన వైఎస్‌ అనిల్‌రెడ్డి కి సంబంధించిన కంపెనీల కార్యాలయాలు, నివాసాల్లో సిట్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. మద్యం ముడుపుల సొమ్మును విదేశాలకు తరలించేందుకు ఈ కంపెనీలను వాడుకున్నారని అనుమానిస్తున్న సిట్‌ అధికారులు.. మరిన్ని ఆధారాలు సేకరించేందుకు ఈ సోదాలు చేపట్టారు. చెన్నైలోని మైలాపూర్, టీనగర్, పేరంగుడి, అరప్పుకొట్టాయ్, హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో అనిల్‌రెడ్డికి సంబంధించిన కంపెనీల కార్యాలయాలు, చెన్నై అళ్వార్‌పేట్, ఇంజంబాక్కంల్లోని అనిల్‌రెడ్డి నివాసాల్లో ఈ తనిఖీలు జరిగాయి.అనిల్‌రెడ్డి జగన్‌కు వరుసకు సోదరుడు మాత్రమే కాదు అత్యంత సన్నిహితుడు కూడా. చెన్నైలో నివసిస్తుంటారు. జగన్‌ తరఫున వివిధ ఆర్థిక వ్యవహారాలు చక్కబెడుతుంటారనే ప్రచారముంది. గతంలో ఆఫ్రికాలో మద్యం వ్యాపారం నిర్వహించేవారు. వైకాపా హయాంలో జరిగిన ఇసుక కుంభకోణంలోనూ జేసీకేసీ, ప్రతిమ సంస్థలను ముందుపెట్టి అనిల్‌రెడ్డే ఇసుక దందా నిర్వహించారనే ఆరోపణలున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల కోసం వైకాపా తరఫున పెద్ద ఎత్తున సర్వేలు చేయించి, అభ్యర్థులకు నగదు అందించారన్న ఫిర్యాదులున్నాయి. అది మద్యం ముడుపుల సొమ్మేనని సిట్‌ అనుమానిస్తోంది. వీటన్నింటి గుట్టు రట్టు చేసేందుకు ఈ సోదాలు జరిపింది.

రూ. 4000 కో­ట్ల లి­క్క­ర్ స్కాం­పై ఎన్‌­ఫో­ర్స్‌­మెం­ట్ డై­రె­క్ట­రే­ట్‌, హై­ద­రా­బా­ద్‌ జో­న­ల్‌ ఆఫీ­స్‌ భా­రీ­గా తని­ఖీ­లు ని­ర్వ­హిం­చా­యి. మనీ­లాం­డ­రిం­గ్ చట్టం , 2002 కింద హై­ద­రా­బా­ద్, బెం­గ­ళూ­రు, చె­న్నై, తం­జా­వూ­రు, సూ­ర­త్, రా­య్‌­పూ­ర్, ఢి­ల్లీ ఎన్‌­సీ­ఆ­ర్, ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో­ని 20 ప్ర­దే­శా­ల్లో సె­ర్చ్ ఆప­రే­ష­న్లు చే­ప­ట్టిం­ది. ఏపీ సీ­ఐ­డీ ఇప్ప­టి­కే ఈ కే­సు­లో ఎఫ్ఐ­ఆ­ర్ నమో­దు చే­సిం­ది. 2019 అక్టో­బ­ర్‌ నుం­డి 2024 మా­ర్చి మధ్య అమలు చే­సిన కొ­త్త లి­క్క­ర్ పా­ల­సీ కిం­దే భారీ మో­సా­లు జరి­గి­న­ట్లు ఆరో­ప­ణ­లు ఉన్నా­యి. పా­పు­ల­ర్ బ్రాం­డ్లు కి­క్‌­బ్యా­క్‌­లు ఇవ్వ­డా­ని­కి ని­రా­క­రిం­చ­గా, వా­టి­ని పక్క­న­బె­ట్టి కొ­త్త / నకి­లీ బ్రాం­డ్ల­ను ప్రో­త్స­హిం­చా­రు. ఆటో­మే­టె­డ్ సి­స్ట­మ్‌­ను తొ­ల­గిం­చి మా­న్యు­వ­ల్ ఆర్డ­ర్ సి­స్ట­మ్‌­కి మా­ర­డం ద్వా­రా సప్లై వా­ల్యూ­మ్‌­లో భారీ మో­సా­లు జరి­గా­యి.

స్వాధీనం చేసిన వస్తువులు

బోగస్ ఇన్వాయిసులు, ట్రాన్స్‌పోర్ట్ చలాన్లు, వేరే ధరలతో ఉన్న పారలల్ ఇన్వాయిసులు దొరికాయి. నిందితుల మధ్య వాట్సాప్ చాట్స్, దుబాయ్‌కు పంపిన డబ్బుల లెడ్జర్లు బయటపడ్డాయి. ఒక ప్రదేశం నుంచి రూ. 38 లక్షల అక్రమ నగదును ED స్వాధీనం చేసుకుంది. ఏపీ లిక్కర్ స్కాంలో డబ్బు మళ్లింపులు, బోగస్ ట్రాన్సాక్షన్లు, కిక్‌బ్యాక్‌లకు సంబంధించిన పక్కా ఆధారాలు దొరకడంతోఈడీ దర్యాప్తు మరింత వేగవంతమైంది.

Tags

Next Story