Nara Lokesh: ఉపాధ్యాయులపై అక్రమ కేసులు ఎత్తేస్తాం: లోకేశ్

వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. న్యాయపరంగా చిక్కులు లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసభలో ఆయన ప్రసంగించారు. గత ఐదేళ్లలో ఉద్యోగ నియమకాలు సున్నా అని విమర్శించారు. డీఎస్సీ ద్వారా ఒక్క పోస్టు భర్తీ చేయలేదని మండిపడ్డారు. ఉపాధ్యాయులపై వైకాపా హయాంలో పెట్టిన అక్రమ కేసులు ఎత్తేస్తామన్నారు.
తెదేపా హయాంలో మొత్తంగా 15 సార్లు డీఎస్సీ నిర్వహించామని వెల్లడించారు. ప్రస్తుతం కూటమి సర్కార్ మెగా డీఎస్సీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఇందుకు సంబంధించి అభ్యర్థులకు వయో పరిమితిని పెంచేలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధితో ఉన్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ మోడల్ ఎడ్యుకేషన్లో ఉపాధ్యాయుల్ని భాగస్వామ్యం చేస్తామని నారా లోకేశ్ తెలిపారు.
‘ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధితో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ మోడల్ ఎడ్యుకేషన్లో ఉపాధ్యాయుల్ని భాగస్వామ్యం చేస్తాం. ఉపాధ్యాయులకు మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఉపాధ్యాయులు విద్యపైన మాత్రమే దృష్టి పెట్టేలా మేం ప్రణాళిక వేస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తాం’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com