AP BJP: ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నూతన కోర్ కమిటీ.. పార్టీ బలోపేతం కోసం..

X
By - Divya Reddy |29 Nov 2021 9:30 PM IST
AP BJP: ఆంధ్రప్రదేశ్లో బీజేపీని బలోపేతం చేసే దిశగా కమలం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
AP BJP: ఆంధ్రప్రదేశ్లో బీజేపీని బలోపేతం చేసే దిశగా కమలం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ బీజేపీ రాష్ట్ర నూతన కోర్ కమిటీని ఏర్పాటు చేసింది. 13 మంది సభ్యులు, ముగ్గురు ప్రత్యేక ఆహ్వానితులతో కూడిన కోర్ కమిటీని ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటించారు. ఈ కమిటీలో సోమువీర్రాజు, పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, సత్యకుమార్, ఎంపీలు సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, జీవీఎల్ నరసింహారావు తదితర నేతలు సభ్యులుగా ఉన్నారు. అలాగే ప్రత్యేక ఆహ్వానితులుగా శివప్రకాశ్, మురళీధరన్, సునీల్ దేవధర్లను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com