AP CABINET: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ ఆమోదం

AP CABINET: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ ఆమోదం
X
కీలక నిర్ణయాలు తీసుకున్న మంత్రివర్గం... కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఓకే.. మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం.. ఏపీలో 28కి పెరగనున్న జిల్లాలు

ఏపీ­లో ప్ర­స్తు­తం జరు­గు­తు­న్న జి­ల్లాల పు­న­ర్ వి­భ­జ­న­లో భా­గం­గా కూ­ట­మి ప్ర­భు­త్వం కీలక ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. ఇవాళ అమ­రా­వ­తి­లో జరి­గిన రా­ష్ట్ర మం­త్రి­వ­ర్గ భే­టీ­లో మూడు కొ­త్త జి­ల్లాల ఏర్పా­టు­కు లైన్ క్లి­య­ర్ చే­సిం­ది. ఇం­దు­లో గతం­లో ఆమో­దిం­చిన రెం­డు జి­ల్లా­ల­తో పాటు కొ­త్త­గా మరో జి­ల్లా కూడా ఉంది. దీం­తో ఈ జి­ల్లాల ఏర్పా­టు­కు మా­ర్గం సు­గ­మం అవు­తోం­ది. ఈ సం­ద­ర్భం­గా కీలక పరి­ణా­మా­లు చోటు చే­సు­కు­న్నా­యి. సీఎం చం­ద్ర­బా­బు అధ్య­క్ష­తన జరి­గిన ఈ సమా­వే­శం­లో జి­ల్లాల పు­న­ర్వి­భ­జన ప్ర­తి­పా­ద­న­ల­కు మం­త్రి­వ­ర్గం ఆమో­దం తె­లి­పిం­ది. మం­త్రి­వ­ర్గ ని­ర్ణ­యం­తో కొ­త్త­గా మద­న­ప­ల్లె, మా­ర్కా­పు­రం, రం­ప­చో­డ­వ­రం జి­ల్లా­లు ఏర్పా­టు కా­ను­న్నా­యి. దీం­తో రా­ష్ట్రం­లో­ని జి­ల్లాల సం­ఖ్య 28కి పె­ర­గ­నుం­ది. దీ­ని­కి సం­బం­ధిం­చి రేపు తుది గె­జి­ట్‌ నో­టి­ఫి­కే­ష­న్‌ వి­డు­దల కా­నుం­ది. అన్న­మ­య్య జి­ల్లా­లో­ని రా­య­చో­టి­ని మద­న­ప­ల్లె కొ­త్త జి­ల్లా­కు, రా­జం­పే­ట­ను కడప జి­ల్లా­కు, రై­ల్వే కో­డూ­రు­ను తి­రు­ప­తి జి­ల్లా­కు, గూ­డూ­రు­ను తి­రు­ప­తి జి­ల్లా నుం­చి నె­ల్లూ­రు­లో కలి­పే ప్ర­తి­పా­ద­న­ల­కు మం­త్రి­వ­ర్గం ఆమో­దం తె­లి­పిం­ది. మరో­వై­పు కొ­త్త­గా 5 రె­వె­న్యూ డి­వి­జ­న్ల ఏర్పా­టు­కు మం­త్రి­వ­ర్గం ఆమో­దం తె­లి­పిం­ది. గతం­లో ఏర్పా­టు చే­సిన 25 జి­ల్లా­ల­కు తోడు మా­ర్కా­పు­రం, మద­న­ప­ల్లె జి­ల్లా­లు మా­త్ర­మే ఏర్పా­టు చే­యా­ల­ని భా­విం­చిన ప్ర­భు­త్వం అనం­త­రం రం­ప­చో­డ­వ­రం కేం­ద్రం­గా మన్యం­లో మరో జి­ల్లా ఏర్పా­టు­కు గ్రీ­న్ సి­గ్న­ల్ ఇచ్చిం­ది.

విధిలేని పరిస్థితుల వల్లే...

మంత్రివర్గం ముగిశాక వివిధ తాజా పరిణామాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. విధిలేని పరిస్థితుల్లోనే రాయచోటిని జిల్లా కేంద్రంగా మార్చాల్సి వచ్చిందని సీఎం తెలిపారు. రాయచోటి కేంద్రంగా జిల్లా కోసం మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి పోరాడుతున్నారని, ఒక్క నియోజకవర్గాన్ని జిల్లా చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రాజంపేట వాసులు కడపను కోరుకుంటున్నారని, రైల్వేకోడూరు వాసులు తిరుపతి కోరుకుంటున్నారని సీఎం అన్నారు. రాయచోటి మార్పు తప్పట్లేదన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం మార్పు తప్పలేదని వివరించారు. ఆదోని 2 మండలాల ఏర్పాటుపై భేటీలో చర్చ సాగింది. మూడు మండలాల ఏర్పాటుపై చర్చ జరగగా, 2 మండలాలకే పరిమితం చేయాలని నిర్ణయించారు.

కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి

అన్న­మ­య్య జి­ల్లా కేం­ద్రం­గా ఉన్న రా­య­చో­టి మా­ర్పు అం­శం­పై ఏపీ కే­బి­నె­ట్ సమా­వే­శం­లో చర్చ­కు వచ్చిం­ది. ఈ మా­ర్పు­పై మం­త్రి రాం­ప్ర­సా­ద్‌­రె­డ్డి భా­వో­ద్వే­గా­ని­కి లోనై కన్నీ­ళ్లు పె­ట్టు­కు­న్నా­రు. జి­ల్లా కేం­ద్రం మా­ర్పు వల్ల ప్ర­జ­ల్లో ఆం­దో­ళన పె­రు­గు­తుం­ద­ని ఆయన తన ఆవే­ద­న­ను వ్య­క్తం చే­శా­రు. ఈ సం­ద­ర్భం­గా సీఎం చం­ద్ర­బా­బు నా­యు­డు మం­త్రి­ని ఓదా­ర్చి ధై­ర్యం చె­ప్పా­రు. జి­ల్లా కేం­ద్రం మా­ర్పు చే­య­క­పో­తే భవి­ష్య­త్తు­లో ఎదు­ర­య్యే సాం­కే­తిక, పరి­పా­ల­నా సమ­స్య­ల­ను సీఎం వి­వ­రిం­చా­రు. అలా­గే రా­య­చో­టి అభి­వృ­ద్ధి­ని తానే ప్ర­త్యే­కం­గా చూ­సు­కుం­టా­న­ని, పట్ట­ణా­ని­కి ఎలాం­టి నష్టం జర­గ­ని­వ్వ­బో­న­ని సీఎం చం­ద్ర­బా­బు మం­త్రి రాం­ప్ర­సా­ద్‌­రె­డ్డి­కి హామీ ఇచ్చా­రు.

Tags

Next Story