AP: గ్రామ పంచాయతీల్లో క్లస్టర్ వ్యవస్థ రద్దు

AP: గ్రామ పంచాయతీల్లో క్లస్టర్ వ్యవస్థ రద్దు
X
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గ్రామ పంచాయతీల్లో క్లస్టర్ వ్యవస్థ రద్దు.. గ్రామ వ్యవస్థలో నూతన సంస్కరణలు

గ్రామ పం­చా­య­తీల పరి­పా­ల­నా వ్య­వ­స్థ­లో నూతన సం­స్క­ర­ణ­ల­కు ఆం­ధ్ర­ప్ర­దే­శ్ మం­త్రి­వ­ర్గం ఆమో­ద­ము­ద్ర వే­సిం­ది. డి­ప్యూ­టీ సీఎం పవన్ కల్యా­ణ్ చొ­ర­వ­తో గ్రామ పం­చా­య­తీ­ల్లో పా­ర­ద­ర్శ­క­త­తో కూ­డిన పాలన అం­దిం­చేం­దు­కు ఈ నూతన వి­ధా­నా­ల­కు రూ­ప­క­ల్పన చే­శా­రు. మాజీ రా­ష్ట్ర­ప­తి డా.అబ్దు­ల్ కలాం ‘పల్లె­ల్లో మౌ­లిక వస­తు­లు మె­రు­గు­ప­ర­చ­డా­ని­కి, పౌర సే­వ­లు సక్ర­మం­గా అం­దే­లా పాలన వ్య­వ­స్థ­ను పు­న­ర్వ్య­వ­స్థీ­క­రిం­చా­లి’అని చె­ప్పా­రు. ఆ స్ఫూ­ర్తి­ని ఆచ­ర­ణ­లో­కి తీ­సు­కు­వ­చ్చే­లా సం­స్క­ర­ణ­ల­కు శ్రీ­కా­రం చు­ట్టా­రు పవన్ కళ్యా­ణ్. పం­చా­య­తీ­రా­జ్ పరి­పా­లన సం­స్క­ర­ణ­ల­పై ఆయన ప్ర­త్యేక దృ­ష్టి కేం­ద్రీ­క­రిం­చా­రు. పం­చా­య­తీ­రా­జ్ వ్య­వ­స్థ­పై అధ్య­య­నం చే­సిన ని­పు­ణు­ల­తో 4 నె­ల­ల­పా­టు పలు దఫా­లు చర్చ­లు చే­శా­రు.10 వేలు జనా­భా దా­టిన పం­చా­య­తీ­ల­ను ఇకపై రూ­ర్బ­న్ పం­చా­య­తీ­లు­గా గు­ర్తి­స్తా­రు. పట్టణ స్థా­యి మౌ­లిక సదు­పా­యా­ల­ను రూ­ర్బ­న్ పం­చా­య­తీ­ల­లో కల్పి­స్తా­రు. వీటి పరి­ధి­లో 359 పం­చా­య­తీ­లు వస్తా­యి. నూతన వి­ధా­నం­లో గతం­లో ఉన్న క్ల­స్ట­ర్ వి­ధా­నం రద్దు చేసి పం­చా­య­తీ­ల­ను నా­లు­గు గ్రే­డ్లు­గా వర్గీ­క­రిం­చ­ను­న్నా­రు.పం­చా­య­తీ కా­ర్య­ద­ర్శి పే­రు­ను పం­చా­య­తీ అభి­వృ­ద్ధి అధి­కా­రి­గా మా­ర్పు చే­శా­రు.

క్లస్టర్‌లు ఉండవ్

పు­న­ర్వ్య­వ­స్థీ­క­ర­ణ­తో గ్రామ పం­చా­య­తీ­ల­ను బలో­పే­తం చే­య­డా­ని­కి కూ­ట­మి ప్ర­భు­త్వం ముం­దు­కు వచ్చిం­ది. దీ­ని­లో భా­గం­గా గ్రామ పం­చా­య­తీ­ల్లో క్ల­స్ట­ర్ వ్య­వ­స్థ­ను రద్దు చే­సిం­ది. దీం­తో 7,244 క్ల­స్ట­ర్ల స్థా­నం­లో ఉన్న 13,351 గ్రామ పం­చా­య­తీ­లు.. ఇక మీదట ఇకపై స్వ­తం­త్ర పరి­పా­ల­నా యూ­ని­ట్లు­గా వ్య­వ­హ­రి­స్తా­యి. గ్రామ పం­చా­య­తీ­ల­ను నా­లు­గు గ్రే­డ్లు­గా పు­న­ర్ వ్య­వ­స్థీ­క­రిం­చేం­దు­కు కూ­ట­మి ప్ర­భు­త్వం ఆమో­దం తె­లి­పిం­ది. వీ­టి­తో పాటు అనేక సం­స్క­ర­ణ­లు చే­య­గా.. ఏపీ కే­బి­నె­ట్ వీ­టి­కి ఆమో­దం తె­లి­పిం­ది. 10 వేలు జనా­భా దా­టిన పం­చా­య­తీ­ల­ను “రూ­ర్బ­న్‌ పం­చా­య­తీ­లు”గా గు­ర్తిం­చా­ల­ని ప్ర­భు­త్వం ని­ర్ణ­యిం­చిం­ది. పట్టణ స్థా­యి మౌ­లిక వస­తు­ల­ను ఈ రూ­ర్బ­న్‌ పం­చా­య­తీ­ల­కు అం­దిం­చ­ను­న్నా­రు. గ్రే­డ్‌ 1 పం­చా­య­తీ­ల్లో పని చే­స్తు­న్న 359 మంది కా­ర్య­ద­ర్శు­ల­కు వేతన శ్రే­ణి పెం­పు­తో­పా­టు డి­ప్యూ­టీ ఎం­పీ­డీఓ హోదా కల్పిం­చా­రు. వీ­రి­ని రూ­ర్బ­న్‌ పం­చా­య­తీ­ల్లో ని­య­మిం­చ­ను­న్నా­రు. అలా­గే, 359 మంది జూ­ని­య­ర్‌ అసి­స్టెం­ట్ల­ను సీ­ని­య­ర్‌ అసి­స్టెం­ట్లు­గా ప్ర­మో­ట్‌ చేసి, రూ­ర్బ­న్‌ గ్రే­డ్‌ పం­చా­య­తీ­ల్లో ని­య­మిం­చేం­దు­కు ప్ర­భు­త్వం ఆమో­దం తె­లి­పిం­ది.

Tags

Next Story