AP CM: అబుదాబిలో ఆలయాన్ని చూసి ముగ్ధుడైన సీఎం

AP CM: అబుదాబిలో ఆలయాన్ని చూసి ముగ్ధుడైన సీఎం
X

ఆం­ధ్ర­ప్ర­దే­శ్ ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు యూ­ఏ­ఈ­లో పర్య­ట­న­లో భా­గం­గా అబు­దా­బి­లో­ని బో­చా­స­న్వా­సి అక్ష­ర్ పు­రు­షో­త్తం స్వా­మి­నా­రా­య­ణ్ సం­స్థ (BAPS) హిం­దూ మం­ది­రా­న్ని సం­ద­ర్శిం­చా­రు. ఆలయ సం­ద­ర్శన అనం­త­రం ఆయన మా­ట్లా­డు­తూ, ఇది తన జీ­వి­తం­లో అత్యంత అద్భు­త­మైన అను­భ­వా­ల­లో ఒకటి అని అభి­వ­ర్ణిం­చా­రు. ఆల­యా­ని­కి వి­చ్చే­సిన ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు­కు బ్ర­హ్మ­వి­హా­రి­దా­స్ స్వా­మి సాదర స్వా­గ­తం పలి­కా­రు. అనం­త­రం ఆలయ వి­శి­ష్ట­త­ల­ను, అద్భు­త­మైన శి­ల్ప­క­ళ­ను, ఆధు­నిక ఆవి­ష్క­ర­ణ­ల­ను, ఐక్యత సం­దే­శా­న్ని ఆయ­న­కు వి­వ­రిం­చా­రు. ఆల­యం­లో­ని సుం­ద­ర­మైన, సు­న్ని­త­మైన కళా­నై­పు­ణ్యా­న్ని చూసి ము­గ్ధు­డైన చం­ద్ర­బా­బు, దీ­ని­ని "ఒక ని­జ­మైన అద్భు­తం" అని కొ­ని­యా­డా­రు. ఈ సం­ద­ర్భం­గా ఆయన ఆల­యం­లో­ని దే­వ­తా­మూ­ర్తు­ల­కు ప్ర­త్యేక పూ­జ­లు ని­ర్వ­హిం­చా­రు.

అనంతరం దుబాయ్ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. పా­ల­న­లో సాం­కే­తి­క­త­ను జో­డి­స్తూ వా­ట్స­ప్ ద్వా­రా 730కి పైగా పౌర సే­వ­ల­ను అం­ది­స్తు­న్నా­మ­ని, ‘స్పీ­డ్ ఆఫ్ డూ­యిం­గ్ బి­జి­నె­స్’ ద్వా­రా రా­ష్ట్రా­ని­కి పె­ట్టు­బ­డు­ల­ను ఆక­ర్షి­స్తు­న్నా­మ­ని చం­ద్ర­బా­బు వి­వ­రిం­చా­రు. అబు­దా­బీ, దు­బా­య్ నగ­రా­లు ఆయి­ల్ ఎకా­న­మీ నుం­చి పర్యా­ట­కం, నా­లె­డ్జి ఎకా­న­మీ వైపు ఎలా పయ­ని­స్తు­న్నా­యో స్ఫూ­ర్తి­గా తీ­సు­కో­వా­ల­న్నా­రు. లక్ష­న్నర హో­ట­ల్ రూ­ము­ల­తో దు­బా­య్ ఆతి­థ్య రం­గం­లో అద్భు­తా­లు సృ­ష్టి­స్తోం­ద­ని, అదే తరహా అభి­వృ­ద్ధి­ని ఏపీ­లో సా­ధి­స్తా­మ­ని ధీమా వ్య­క్తం చే­శా­రు. అబు­దా­బీ, దు­బా­య్ ఆయి­ల్ ఎకా­న­మీ నుం­చి పర్యా­ట­కం, నా­లె­డ్జి ఎకా­న­మీ ది­శ­గా నడు­స్తు­న్నా­యి. 1.50 లక్షల హో­ట­ల్ రూ­ము­ల­తో ఆతి­థ్య రం­గా­ని­కి పె­ద్ద ఎత్తున ఆదా­యా­న్ని ఆర్జిం­చి పె­డు­తోం­ది’ అని ఏపీ సీఎం చం­ద్ర­బా­బు అన్నా­రు.

Tags

Next Story