AP: నిరుద్యోగులకు భారీ శుభవార్త

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ శుభవార్తను అందించింది. నిలిచిపోయిన కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్టు ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇన్ఛార్జి ఛైర్మన్ రవికృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది డిసెంబరు చివరి వారంలో ఫిజికల్ టెస్ట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి 2022లో నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులకు గతేడాది జనవరిలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ఈ సంవత్సరం డిసెంబర్ లో ఫిజికల్ టెస్ట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2022 లో 6100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా.. గత సంవత్సరం జనవరిలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. 4,59,182 మంది ఈ ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 95,208 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అనంతరం పలు కారణాలతో.. కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియను అర్ధాంతరంగా నిలిపివేశారు. కాగా అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఈనెల11 నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు slrb.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com