AP: నేడు కడపకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

AP: నేడు కడపకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
X
వైసీపీ నేతల దాడిలో గాయపడ్డ ఎంపీడీవో.. పరామర్శించనున్న పవన్ కల్యాణ్

అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై దాడి ఘటనను ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో ఆయనే నేరుగా రంగంలోకి దిగారు. అందులో భాగంగా.. ఈరోజు కడపలో పర్యటించబోతున్నారు.. వైసీపీ నాయకుల దాడిలో గాయపడి.. కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరామర్శించనున్నారు. ఈ దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా కడపకు చేరుకొని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీడీవోను పరామర్శించనున్నారు. అనంతరం గాలివీడుకు రోడ్డు మార్గాన వెళ్లనున్నారు. అనంతరం గాలివీడు నుంచి రాయచోటిలోని స్టేట్ గెస్ట్ హౌస్ కు చేరుకోనున్నారు.

నకిలీ ఐపీఎస్ కలకలం

పార్వతీపురం మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో భద్రతా లోపం తీవ్ర కలకలం రేపింది. దీంతో ఐపీఎస్ యూనిఫారంతో వచ్చిన సూర్య ప్రకాష్ అనే వ్యక్తిని విజయనగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, అతడ్ని విజయనగరం జిల్లా ముడిదాం ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించారు. కాగా, గత ఏడాదే ఐపీఎస్ కు సెలక్ట్ అయ్యానని చెప్పిన సూర్యప్రకాస్.. ట్రైనింగ్ లో ఉండి పవన్ పర్యటన కోసం వచ్చానని చెప్పాడు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో భద్రతా లోపంపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. వై కేటగిరీ భద్రతలో ఉన్న పవన్ కల్యాణ్ చుట్టూ నకిలీ ఐపీఎస్ తిరగడంపై విచారణకు ఆదేశించారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని హోంమంత్రి ఆదేశించారు. డిప్యూటీ సీఎం పర్యటనలో అసలు భద్రతా లోపం ఎలా తలెత్తిందని ఉన్నతాధికారులను హోంమంత్రి ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు.

Tags

Next Story