AP: డబుల్ ఇంజిన్ సర్కార్.. డబుల్ డిజిట్ గ్రోత్

AP: డబుల్ ఇంజిన్ సర్కార్.. డబుల్ డిజిట్ గ్రోత్
X
జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం... పరిపాలనకు కలెక్టర్లే వెన్నెముక అన్న సీఎం... పాలనలో మొదటి ఏడాది పరీక్షలు పూర్తి.. ఇక బాధ్యతగా పనిచేయాలని సీఎం సూచన

స్వ­ర్ణాం­ధ్ర­ప్ర­దే­శ్‌ 2047 అధి­కా­రు­ల­కు భగ­వ­ద్గీత, బై­బి­ల్, ఖు­రా­న్‌ కా­వా­ల­ని ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు నా­యు­డు స్ప­ష్టం చే­శా­రు. తె­లు­గు­వా­ళ్ల­ను అగ్ర­స్థా­నం­లో ఉం­చా­ల­న్న­దే తన లక్ష్య­మ­ని వె­ల్ల­డిం­చా­రు. ఏపీ సచి­వా­ల­యం­లో కలె­క్ట­ర్ల సద­స్సు జరి­గిం­ది. ఇం­దు­లో ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు నా­యు­డు అధి­కా­రు­ల­కు కీలక ఆదే­శా­లు జారీ చే­శా­రు. కొ­త్త­గా వచ్చిన కలె­క్ట­ర్ల­కు చం­ద్ర­బా­బు అభి­నం­ద­న­లు తె­లి­పా­రు. అం­తే­కా­కుం­డా పాత కలె­క్ట­ర్లు కూడా పని­తీ­రు మె­రు­గు­ప­రు­చు­కో­వా­ల­ని చె­ప్పా­రు. అభి­వృ­ద్ధి­ని పరు­గు­లు పె­ట్టి­స్తూ­నే.. సం­క్షేమ కా­ర్య­క్ర­మా­లు కూడా కొ­న­సా­గి­స్తా­మ­ని స్ప­ష్టం చే­శా­రు.

పాలనలో బాధ్యతగా పని చేయండి

వా­ట్సా­ప్ గవ­ర్నె­న్స్ ద్వా­రా పౌ­ర­సే­వ­లు అం­ది­స్తు­న్నా­మ­ని చం­ద్ర­బా­బు గు­ర్తు చే­శా­రు. సద­స్సు­లో అధి­కా­రు­ల­కు సీఎం పలు అం­శా­ల­పై మా­ర్గ­ని­ర్దే­శం చే­శా­రు. పా­ల­న­లో మొ­ద­టి ఏడా­ది పరీ­క్ష­లు పూ­ర్తి అయి­పో­యా­య­ని చె­ప్పు­కొ­చ్చా­రు. ఇంకా బా­ధ్య­త­గా పని­చే­యా­ల్సిన సమయం వచ్చిం­ద­ని తె­లి­పా­రు. ప్ర­త్యేక దృ­ష్టి పె­ట్టి పని­చే­య­క­పో­తే ఫలి­తా­లు రా­వ­ని సీఎం చం­ద్ర­బా­బు పే­ర్కొ­న్నా­రు. సాం­కే­తి­కత పె­రి­గిన దృ­ష్ట్యా స్మా­ర్ట్ వర్క్ చే­యా­ల్సిం­దే­న­ని ఆదే­శిం­చా­రు. ఏఐ, డేటా లేక్ వంటి వాటి ద్వా­రా సమ­న్వ­యం చే­సు­కుం­టూ వె­ళ్లా­ల­ని సూ­చిం­చా­రు. పథ­కా­లు, కా­ర్య­క్ర­మాల అమలు కోసం ఆర్టీ­జీ­ఎ­స్ సే­వ­ల­ను ఉప­యో­గిం­చు­కో­వా­ల­ని మా­ర్గ­ని­ర్దే­శం చే­శా­రు. వి­జ­న్ రూ­పొం­దిం­చి దా­ని­కి ని­ధు­లు కే­టా­యిం­చ­క­పో­తే ఇబ్బం­దు­లు వస్తా­య­ని చె­ప్పు­కొ­చ్చా­రు. సంపద సృ­ష్టిం­చి ఆదా­యా­న్ని పెం­చి సం­క్షే­మం అమలు చే­స్తా­మ­ని చె­ప్పా­మ­ని.. అదే వి­ధం­గా సూ­ప­ర్ సి­క్స్‌­ను సక్సె­స్ చే­శా­మ­ని ఉద్ఘా­టిం­చా­రు. దే­శం­లో­నే అతి­పె­ద్ద సం­క్షేమ పథ­కం­లో భా­గం­గా 64 లక్షల మంది లబ్ధి­దా­రు­ల­కు పె­న్ష­న్ ఇస్తు­న్నా­మ­ని పే­ర్కొ­న్నా­రు. భారత ఆర్ధిక వ్య­వ­స్థ 11వ స్థా­నం నుం­చి 4 స్థా­నా­ని­కి చే­రు­కుం­ద­ని, మరో 22 ఏళ్ల­లో స్వా­తం­త్య్రం వచ్చి వం­దే­ళ్లు పూ­ర్త­య్యే సమ­యా­ని­కి భా­ర­త్ కూడా అగ్ర­స్థా­నా­ని­కి చే­రు­కుం­టుం­ద­ని ఆశా­భా­వం వ్య­క్తం చే­శా­రు. ప్ర­స్తు­తం వృ­ద్ధి­రే­టు 10.5 శాతం ఉం­ద­న్నా­రు. ఈ ఏడా­ది తల­స­రి ఆదా­యా­న్ని 3.47 లక్ష­ల­కు తీ­సు­కె­ళ్లా­ల­ని ప్ర­య­త్నా­లు చే­స్తు­న్నా­మ­న్నా­రు. 2029 నా­టి­కి 29 లక్షల జీ­ఎ­స్డీ­పీ లక్ష్యం­గా కూ­ట­మి ప్ర­భు­త్వం పని­చే­స్తోం­ద­ని స్ప­ష్టం చే­శా­రు. అప్ప­టి­కి 4.67 లక్షల తల­స­రి ఆదా­యం లక్ష్యం­గా మనం పని చే­యా­ల­ని సూ­చిం­చా­రు.


స్మార్ట్ వర్క్ చేస్తేనే మంచిది

పా­ల­సీ ఇవ్వ­డం కాదు.. అమలు చే­య­డం కూడా ము­ఖ్య­మే­న­ని చం­ద్ర­బా­బు స్ప­ష్టం చే­శా­రు.పే­ద­రిక ని­ర్మూ­లన లక్ష్యం­గా పె­ట్టు­కు­న్నా­మ­న్నా­రు. జి­ల్లాల రూపు రే­ఖ­లు మా­ర్చే ఛా­న్స్ కలె­క్ట­ర్ల­కు ఉం­ద­ని సీఎం గు­ర్తు చే­శా­రు. ప్ర­స్తు­తం స్మా­ర్ట్ వర్క్ చే­స్తే­నే మం­చి­ద­న్నా­రు. భా­ర­త్‌­ను మె­ు­ద­టి­స్థా­నం­లో ని­ల­పా­ల­ని చె­ప్పా­రు. మోదీ ప్ర­ధా­ని అయ్యాక 11వ ఆర్థిక వ్య­వ­స్థ­గా ఉన్న భా­ర­త­దే­శం.. ప్ర­స్తు­తం నా­లు­గో అతి­పె­ద్ద ఆర్థిక వ్య­వ­స్థ­గా తయా­రైం­ద­న్నా­రు. 'స్వా­తం­త్య్రం వచ్చి వం­దే­ళ్లు పూ­ర్త­య్యే­స­రి­కి మన దేశం అగ్ర­స్థా­నం చే­రు­కుం­టుం­ది. 1991కి ముం­దు సం­స్క­ర­ణ­లు రా­లే­దు. అప్పు­డు ఆర్థిక వృ­ద్ధి రెం­డు లేదా మూడు శాతం ఉం­డే­ది. అప్పు­డు వృ­ద్ధి రేటు గు­రిం­చి మా­ట్లా­డి­నా.. టె­క్నా­ల­జీ­పై మా­ట్లా­డి­నా హేళన చే­సే­వా­రు. అప్పు­డు సం­స్క­ర­ణ­లు వద్ద­న్న రా­జ­కీయ పా­ర్టీల మను­గడ ఇప్పు­డు లే­కుం­డా పో­యిం­ది.' అని చం­ద్ర­బా­బు అన్నా­రు.

పనితీరు బాగుంటేనే కొనసాగింపు..

“కా­ర్యా­ల­యా­ల్లో కూ­ర్చు­ని కా­గి­తా­లు చూ­స్తే అంతా సవ్యం­గా­నే కని­పి­స్తుం­ది. కానీ క్షే­త్ర­స్థా­యి వా­స్త­వా­లు వే­రు­గా ఉం­టా­యి. అధి­కా­రు­లు మా­న­వ­తా దృ­క్ప­థం­తో ఆలో­చిం­చి, క్షే­త్ర­స్థా­యి­లో పర్య­టిం­చి వా­స్తవ పరి­స్థి­తు­ల­ను గ్ర­హిం­చా­లి,” అని చం­ద్ర­బా­బు కలె­క్ట­ర్ల­కు స్ప­ష్ట­మైన ఆదే­శా­లు జారీ చే­శా­రు. ప్ర­భు­త్వ పథ­కాల ఫలా­లు అర్హు­లైన ప్ర­తి ఒక్క­రి­కీ చే­రా­లం­టే క్షే­త్ర­స్థా­యి అను­భ­వ­మే కీ­ల­క­మ­ని ఆయన నొ­క్కి చె­ప్పా­రు. పా­ల­న­లో ప్ర­ధా­ని, ము­ఖ్య­మం­త్రి తర్వాత జి­ల్లా స్థా­యి­లో కలె­క్ట­ర్లే అత్యంత కీ­ల­క­మైన వ్య­క్తు­ల­ని చం­ద్ర­బా­బు అభి­వ­ర్ణిం­చా­రు. “ఒక జి­ల్లా రూ­పు­రే­ఖ­ల­ను మా­ర్చే ప్ర­ధాన బా­ధ్యత కలె­క్ట­ర్ల­దే. ప్ర­భు­త్వం రూ­పొం­దిం­చిన వి­ధా­నా­ల­ను క్షే­త్ర­స్థా­యి­లో సక్ర­మం­గా అమలు చే­యా­ల్సిం­ది మీరే. అం­దు­కే సరైన వ్య­క్తి సరైన చోట ఉం­డా­ల­నే లక్ష్యం­తో­నే సీ­ఎ­స్, డీ­జీ­పీల నుం­చి క్షే­త్ర­స్థా­యి అధి­కా­రుల వరకు ని­యా­మ­కా­లు చే­ప­ట్టాం. ఎమ్మె­ల్యేల ఎం­పిక, మం­త్రి­వ­ర్గ కూ­ర్పు­లో ఎలాం­టి ని­శిత పరి­శీ­లన చే­శా­మో, అదే తర­హా­లో సమ­ర్థు­లైన వా­రి­ని కలె­క్ట­ర్లు­గా ని­య­మిం­చాం. మీ­రం­తా ప్ర­భు­త్వా­ని­కి మంచి పేరు తె­చ్చే­లా పని­చే­యా­లి,” అని ఆయన ఆకాం­క్షిం­చా­రు.

Tags

Next Story