డాక్టర్ సుధాకర్‌ కేసుపై నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో విచారణ

డాక్టర్ సుధాకర్‌ కేసుపై నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో విచారణ
ఏ ప్రభుత్వం ఉన్న వైద్యుడిగా సేవలు అందించడం తన ధర్మం అని చెప్పారు సుధాకర్. అనవసరంగా తనపై పిచ్చివాడు అని ముద్ర వేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

డాక్టర్ సుధాకర్‌ కేసులో నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యవిధాన పరిషత్ కోఆర్డినేటర్ వి.లక్ష్మణ్‌రావు విచారణ చేపట్టారు. రూల్ 20ని అతిక్రమించి డాక్టర్ సుధాకర్ చేసిన ఆరోపణలపై విచారణ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. డాక్టర్ సుధాకర్ కూడా విచారణకు హాజరయ్యారు. మాస్కులు లేవని అడిగానే తప్ప.. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే ఉద్దేశం తనకు లేదని సుధాకర్ తెలిపారు..6 నెలలుగా ఖాళీగా ఉన్నానని..ఎక్కడైనా పోస్టింగ్ ఇస్తే ప్రజలకు సేవ చేసుకుంటానని చెప్పారు. ఏ ప్రభుత్వం ఉన్న వైద్యుడిగా సేవలు అందించడం తన ధర్మం అని చెప్పారు సుధాకర్. అనవసరంగా తనపై పిచ్చివాడు అని ముద్ర వేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

అప్పట్లో డాక్టర్ సుధాకర్ కేసు తీవ్ర సంచలనంగా మారింది. ప్రభుత్వం ఆయనపట్ల అనుసరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. కరోనా వైరస్ వ్యాపిస్తున్నా ప్రభుత్వం డాక్టర్లకు N95 మాస్కులు కూడా ఇవ్వడం లేదంటూ డాక్టర్ సుధాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నించిన పాపానికి సుధాకర్‌ను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. సుధాకర్ ఫాల్స్‌ న్యూస్‌ను ప్రచారం చేస్తున్నారంటూ ఏప్రిల్ 8న ఆయనపై వేటు వేసింది. అటు ఈ ఘటన తర్వాత నడిరోడ్డుపై పోలీసులు డాక్టర్ సుధాకర్ పట్ల అత్యంత అమానుషంగా వ్యవహరించారు. ఆయన చేతులు వెనక్కి విరిచికట్టిన తీరుపై ప్రజా సంఘాలు, దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. చివరికి డాక్టర్ సుధాకర్‌పై కేసులు పెట్టి జైలుకు పంపారు. ఓ దశలో ఆయనపై పిచ్చోడిగా ముద్రవేశారు. దీనిపై సుధాకర్ తల్లి కోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన హైకోర్టు సుధాకర్ కేసును CBIకి అప్పగించింది.


Tags

Read MoreRead Less
Next Story