AP Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం..

X
AP Elections (tv5news.in)
By - Divya Reddy |14 Nov 2021 7:45 AM IST
AP Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
AP Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 36 పంచాయతీలు, 68 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయా పంచాయతీల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం వరకు కొనసాగనుంది. ఇక అనంతపురం జిల్లాలోని కందికాపుల గ్రామ పంచాయతీకి కూడా ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. కరోనాతో సర్పంచ్ మృతిచెందడంతో మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 18 మంది సిబ్బందితో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com