AERO SPACE: ఏరోస్పేస్-డిఫెన్స్ పాలసీ ప్రకటించిన ఏపీ

AERO SPACE: ఏరోస్పేస్-డిఫెన్స్ పాలసీ ప్రకటించిన ఏపీ
X
ఏరో స్పేస్, రక్షణ రంగాల్లో ఏపీని అగ్రస్థానంలో నిలుపుతామన్న చంద్రబాబు

ఏరో­స్పే­స్, రక్షణ రం­గా­ల్లో ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­ను దే­శం­లో­నే అగ్ర­గా­మి­గా ని­ల­పా­ల­నే లక్ష్యం­తో కూ­ట­మి ప్ర­భు­త్వం కీలక ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. ఈ మే­ర­కు 'ఏపీ ఏరో­స్పే­స్-డి­ఫె­న్స్ పా­ల­సీ-4.0'ను ప్ర­క­టిం­చిం­ది. 2025 నుం­చి 2030 మధ్య కా­లా­ని­కి వర్తిం­చే ఈ సరి­కొ­త్త వి­ధా­నం ద్వా­రా రా­ష్ట్ర పా­రి­శ్రా­మిక రం­గా­ని­కి కొ­త్త ఊపు­ని­వ్వా­ల­ని చం­ద్ర­బా­బు ప్ర­భు­త్వం భా­వి­స్తోం­ది. ఈ మే­ర­కు పరి­శ్ర­మ­లు, వా­ణి­జ్య శాఖ కా­ర్య­ద­ర్శి ఎన్. యు­వ­రా­జ్ ఉత్త­ర్వు­లు జారీ చే­శా­రు. ఈ కొ­త్త వి­ధా­నం ద్వా­రా వచ్చే ఐదే­ళ్ల­లో రా­ష్ట్రా­ని­కి ఏకం­గా రూ. లక్ష కో­ట్ల కొ­త్త పె­ట్టు­బ­డు­ల­ను ఆక­ర్షిం­చ­డ­మే లక్ష్యం­గా ప్ర­భు­త్వం ని­ర్దే­శిం­చు­కుం­ది. దీని ద్వా­రా సు­మా­రు లక్ష మం­ది­కి ప్ర­త్య­క్షం­గా, పరో­క్షం­గా ఉపా­ధి అవ­కా­శా­లు కల్పిం­చ­ను­న్న­ట్లు స్ప­ష్టం చే­సిం­ది. ఏరో­స్పే­స్, రక్షణ రం­గా­ల్లో­కి చి­న్న, మధ్య తరహా పరి­శ్ర­మ­లు (MSME), స్టా­ర్ట­ప్‌­ల­తో పాటు భారీ సం­స్థ­ల­ను కూడా ప్రో­త్స­హిం­చా­ల­ని ప్ర­భు­త్వం లక్ష్యం­గా పె­ట్టు­కుం­ది.

మోడల్‌లో పార్కులు

పె­ట్టు­బ­డు­ల­ను ఆక­ర్షిం­చేం­దు­కు రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా పలు­చో­ట్ల ఏరో­స్పే­స్, రక్షణ రంగ క్ల­స్ట­ర్‌­ల­ను ఏర్పా­టు చే­య­నుం­ది. ఇం­దు­కో­సం ఇప్ప­టి­కే 23 వేల ఎక­రాల భూ­మి­ని గు­ర్తిం­చి­న­ట్లు ప్ర­భు­త్వం వె­ల్ల­డిం­చిం­ది. "హబ్ అండ్ స్పో­క్" నమూ­నా­లో ప్ర­త్యే­కం­గా ఎం­ఎ­స్‌­ఎంఈ పా­ర్కు­ల­ను అభి­వృ­ద్ధి చే­య­ను­న్నా­రు. ఏపీ­ఐ­ఐ­సీ నో­డ­ల్ ఏజె­న్సీ­గా వ్య­వ­హ­రిం­చి ఈ పా­ర్కు­ల­ను అభి­వృ­ద్ధి చే­స్తుం­ది.

ఏఐ హ్యాకథాన్ ఆరంభించిన సీఎం

శాం­తి­భ­ద్ర­త­లు సరి­గా ఉన్న­చో­టే అభి­వృ­ద్ధి జరు­గు­తుం­ద­ని ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు అన్నా­రు. గుం­టూ­రు­లో­ని ఆర్వీ­ఆ­ర్‌ జేసీ ఇం­జి­నీ­రిం­గ్‌ కళా­శా­ల­లో ఏర్పా­టు చే­సిన కా­ర్య­క్ర­మం­లో పో­లీ­సు ఏఐ హ్యా­క­థా­న్‌­ను సీఎం ప్రా­రం­భిం­చా­రు. ఐటీ కం­పె­నీ­లు, ఏఐ ని­పు­ణు­ల­తో ము­ఖా­ము­ఖి అనం­త­రం ఆయన ప్ర­సం­గిం­చా­రు. " సీ­బీ­ఎ­న్‌ ఉన్నంత వరకూ నే­ర­స్థు­ల­కు చోటు లేదు. సాం­కే­తి­క­త­తో పాటు సంఘ వి­ద్రో­హ­శ­క్తు­ల­పై దృ­ష్టి పె­ట్టాం. క్వాం­టం వ్యా­లీ కింద ఏఐకి ప్రా­ధా­న్యం ఇచ్చాం. ఏఐ ద్వా­రా ప్ర­పంచ వ్యా­ప్త­గా తె­లు­గు­వా­రి సత్తా చా­టా­లి. ఏఐ వస్తే ఉద్యో­గా­లు పో­తా­య­నే­ది అపోహ మా­త్ర­మే. ఆగ­స్టు 15 నుం­చి వా­ట్స­ప్‌ గవ­ర్నె­న్స్‌ ద్వా­రా ఇంటి నుం­చే ధ్రు­వ­ప­త్రా­లు పొం­దొ­చ్చు. ఎప్ప­టి­క­ప్పు­డు టె­క్నా­ల­జీ­ని ఉప­యో­గిం­చు­కో­వా­లి. రా­బో­యే రో­జు­ల్లో హా­ర్డ్‌ వర్క్‌ కాదు.. స్మా­ర్ట్‌ వర్క్‌ చే­స్తే ప్ర­పం­చా­న్ని జయిం­చే పరి­స్థి­తి వస్తుం­ది. దే­శం­లో మొ­ట్ట­మొ­ద­టి సా­రి­గా డ్రో­న్‌ సిటీ, స్పే­స్‌ సిటీ ఏర్పా­టు చే­య­బో­తు­న్నాం.” అని చం­ద్ర­బా­బు వె­ల్ల­డిం­చా­రు.



Tags

Next Story