DSC: నవంబర్లో మెగా డీఎస్సీ..!

నవంబర్ మొదటి వారంతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ను జారీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే ఎటువంటి న్యాయ వివాదాలకు తావు లేకుండా విద్యాశాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది. మూడు, నాలుగు నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేసి, ఆ వెంటనే ఎంపికైన వారికి శిక్షణ ప్రారంభించాలని భావిస్తోంది. 16,347 పోస్టులతో ఈ నోటిఫికేషన్ను జారీ చేస్తారు. ఇటీవల జరిగిన ‘టెట్’ పరీక్షల ఫలితాలు నవంబరు 2న విడుదలవనున్నాయి. విభాగాల వారీగా చూస్తూ.. సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ) పోస్టులు 6,371, స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ) పోస్టులు 7725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులు 1781, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టులు 286, ప్రిన్సిపల్ పోస్టులు 52, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు (పీఈటీ) 132 వరకు ఉన్నాయి.
పోస్టుల వివరాలు ఇవీ
ఈ మెగా డీఎస్సీలో సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ) 6,371, స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ)- 7,725, భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వీటితో పాటు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్(టీజీటీ)-1,781, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్(పీజీటీ)-286, వ్యాయామ ఉపాధ్యాయ(పీఈటీ)-132, ప్రిన్సిపాళ్లు 52 పోస్టుల భర్తీ చేయనుంది.
'టెట్ ప్రిలిమినరీ కీలు అందుబాటులోకి
ఏపీ టెట్ జులై-2024 పరీక్షలకు సంబంధించిన రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక ఆన్సర్ కీలు అన్నింటినీ విద్యాశాక విడుదల చేసింది. ఈ మేరకు అక్టోబర్ 3 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించిన అన్ని పరీక్షల ప్రశ్నపత్రాలు, ప్రిలిమినరీ ‘కీ’లను సెషన్ల వారీగా పాఠశాల విద్యాశాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. పేపర్ 2ఎ సోషల్ స్టడీస్ పరీక్ష ఆన్సర్ ‘కీ’పై అభ్యంతరాలను అక్టోబర్ 25లోపు దాఖలు ఆన్లైన్లో దాఖలు తెలియచేయాలని సూచించింది. కాగా టెట్ జులై సెషన్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 3,68,661 మంది అంటే 86.28 శాతం మంది హాజరయ్యారు. మొత్తం 17 రోజల పాటు రోజుకు రెండు విడతలుగా ఈ పరీక్షలు జరిగాయి. టెట్ తుది ఆన్సర్ ‘కీ’ అక్టోబర్ 27న విడుదల కానుంది. ఇక టెట్ ఫలితాలు నవంబర్ 2న ప్రకటిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com