AP Government : రూ.33,137కోట్లతో అమరావతిలో పనులు

ఏపీ రాజధాని అమరావతిలో రూ.33,137 కోట్లతో 40కి పైగా పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు జారీ చేసింది. ఇందులో రూ.768 కోట్లతో అసెంబ్లీ, రూ.1045 కోట్లతో హైకోర్టు, రూ.4688.83 కోట్లతో సచివాలయం, HOD భవనాలు, టవర్ల నిర్మాణం, మంత్రులు, న్యాయమూర్తులు, కార్యదర్శుల స్థాయి అధికారులకు నివాస భవనాల నిర్మాణం వంటివి చేపట్టనున్నారు. అమరావతి నిర్మాణానికి హడ్కో నుంచి రూ.11,000 కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్వై బ్యాంకు నుంచి రూ.5వేల కోట్లు కలిపి మొత్తం రూ.16వేల కోట్ల రుణం తీసుకునేందుకు సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్కు అనుమతిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. సీఆర్డీఏ కమిషనర్కు రాష్ట్రప్రభుత్వం తరఫున ప్రాజెక్టు అమలు ఏజెన్సీగా వ్యవహరించే బాధ్యతలు అప్పగించింది. ప్రపంచబ్యాంకు, ఏడీబీ, హడ్కో, కేఎఫ్వై బ్యాంకుల నుంచి తీసుకుంటున్న రూ.31వేల కోట్ల రుణం పోను, రాజధాని నిర్మాణానికి అవసరమైన మిగతా నిధులు సమీకరించేందుకు సీఆర్డీఏ కమిషనర్కు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com